Bride: కొద్ది గంటల్లో పెళ్లనగా ఇంట్లోంచి 21 ఏళ్ల వధువు ఎస్కేప్.. ప్రియుడితో కలిసి పారిపోతుండగానే మృతి.. అసలేం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2023-05-31T16:05:27+05:30 IST

ఆ తల్లిదండ్రులు మంచి వరుడిని వెతికి అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారు. అందుకు తగినట్టుగానే అబ్బాయిని చూసి వివాహ ఏర్పాట్లు చేశారు. పెళ్లి కార్డులూ పంచేశారు.

Bride: కొద్ది గంటల్లో పెళ్లనగా ఇంట్లోంచి 21 ఏళ్ల వధువు ఎస్కేప్.. ప్రియుడితో కలిసి పారిపోతుండగానే మృతి.. అసలేం జరిగిందంటే..!
young woman

ఆ తల్లిదండ్రులు మంచి వరుడిని వెతికి అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారు. అందుకు తగినట్టుగానే అబ్బాయిని చూసి వివాహ ఏర్పాట్లు చేశారు. పెళ్లి కార్డులూ పంచేశారు. ఫంక్షన్ హాలు.. క్యాటరింగ్.. విడిది.. విందు.. ఇలా పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మరికొన్ని గంటల్లో పెళ్లనగా అమ్మాయి (Bride) అదృశ్యమైంది. ప్రియుడితో సుఖం ఉండాలని ప్లాన్ చేసుకుని పారిపోతుంటే జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఇంతకీ అసలేమైంది? ఆమె ఎలా తనువు చాలించింది. తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో ఓ యువతి (young woman) పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే వధువు మాత్రం.. పెళ్లికి ఒకరోజు ముందు ప్రియుడిని (lover) పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అనుకున్న ప్లాన్ ప్రకారం ప్రియుడు, అతని బంధువు.. పెళ్లి కూతురు ఇంటికి చేరుకున్నారు. పెళ్లి (wedding) పనుల్లో బిజీగా ఉన్న బంధువులను పక్కదారి పట్టించి ముగ్గురూ కలిసి బైక్‌పై పరారైపోయారు. ఇలా సుమారు కిలోమీటర్ దూరం వెళ్లాక ఓ ట్రక్కును ఢీకొట్టారు. అంతే అక్కడికక్కడే వధువుతో సహా ప్రియుడు, బంధువు ప్రాణాలు కోల్పోయారు (accident). మృతులు రాణి, కరణ్, వికాస్‌గా గుర్తించారు. మృతుల వయస్సు 21 ఏళ్లు మాత్రమే. మృతురాలికి యూపీకి చెందిన ప్రయాగ్‌రాజ్‌కు చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని తెలిసింది. ఆమె తన బంధువైన స్థానిక వ్యక్తిని ప్రేమిస్తున్నట్టుగా తెలిసింది. ఈ కారణం చేతనే పారిపోవటానికి ప్రయత్నించి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.

Updated Date - 2023-05-31T16:05:27+05:30 IST