Draupadi Murmu: భూదాన్ పోచంపల్లిలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ABN, Publish Date - Dec 20 , 2023 | 01:23 PM

యాదాద్రి: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్‌ పోచంపల్లిలో పర్యటిస్తున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆమె.. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పోచంపల్లికి వెళ్లారు. ముందుగా పట్టణంలోని టూరిజం సెంటర్‌, ఆచార్య వినోబాబావే భవనానికి వెళ్లిన రాష్ట్రపతి.. భూదాన ఉద్యమకారులైన వినోబాబావే, వెదిరె రామచంద్రారెడ్డి విగ్రహాలకు నివాళులర్పించారు.

Updated at - Dec 20 , 2023 | 01:23 PM