Yuvagalam Padayatra: లోకేష్ 'యువగళం'‌కు ఖతార్ టీడీపీ ఎన్నారైల సంఘీభావం

ABN , First Publish Date - 2023-01-28T07:19:37+05:30 IST

తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 'యువగళం' పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రకు సంఘిభావంగా ఖతార్ తెలుగుదేశం పార్టీ ఎన్నారై శాఖ నాయకులు గొట్టిపాటి రమణ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.

Yuvagalam Padayatra: లోకేష్ 'యువగళం'‌కు ఖతార్ టీడీపీ ఎన్నారైల సంఘీభావం

ఎన్నారై డెస్క్: తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 'యువగళం' పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రకు సంఘిభావంగా ఖతార్ తెలుగుదేశం పార్టీ ఎన్నారై శాఖ నాయకులు గొట్టిపాటి రమణ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఖతార్‌లో కుండపోతగా కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్కచేయ్యకుండా సభ్యులందరు ఈ పాదయాత్ర కార్యక్రమానికి హాజరయ్యారు. "జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్, జై యువగళం" అంటూ నినాదాలు చేస్తూ తమ మద్దతును తెలియచేసారు. ఈ కార్యక్రమానికి గొట్టిపాటి రమతో పాటు ఉపాధ్యక్షుడు మద్దిపోటి నరేష్, మలిరెడ్డి సత్యనారాయణ, విక్రమ్ సుఖవాసి, గోవర్ధన్, రమేష్, కిరణ్, వాసు, రవికిశోర్, సతీష్ బాబు, శబరీష్, సాయి రమేష్, వెంకప్ప, సతీష్, ఫణి మరియు పలువురు సభ్యులు హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, పని తీరును, ప్రజల పట్ల వ్యవహరిస్తున్నవిధానాలను ఎండగడుతూ నిర్వహిస్తున్న నారా లోకేష్ పాదయాత్ర తెలుగు దేశం పార్టీకి, పార్టీ శ్రేణులకు మరింత మనోబలం ఇస్తుందని ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. అలాగే ఈసారి టీడీపీ తప్పక విజయవంతం అవుతుందని వారు ఆకాంక్షించారు.

TDP.jpg

Updated Date - 2023-01-28T07:19:39+05:30 IST