PoTA: పోలాండ్‌లో మొట్టమొదటి తెలుగు అసోసియేషన్ ప్రారంభం

ABN , First Publish Date - 2023-03-30T11:54:34+05:30 IST

యూరోపియన్ యూనియన్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న పోలాండ్ దేశంలో తెలుగు వారి కోసం మొట్టమొదటి అసోసియేషన్ ప్రారంభం అయ్యింది.

PoTA: పోలాండ్‌లో మొట్టమొదటి తెలుగు అసోసియేషన్ ప్రారంభం

ఎన్నారై డెస్క్: యూరోపియన్ యూనియన్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న పోలాండ్ దేశంలో తెలుగు వారి కోసం మొట్టమొదటి అసోసియేషన్ ప్రారంభం అయ్యింది. పోలాండ్ తెలుగు అసోసియేషన్ (PoTA - Poland Telugu Association) అనే లాభాపేక్ష లేని ఈ సంస్థ ప్రారంభోత్సవం పోలాండ్ రాజధాని నగరం వార్సాలోని ఎయిర్‌పోర్ట్ హోటల్ ఓకేసీయోలో (Airport Hotel Okęcie) ఘనంగా జరిగింది. దీనితో పోలాండ్‌లోని షుమారు ఐదువేల మంది తెలుగు వారి చిరకాల కోరిక నెరవేరింది. గత రెండు సంవత్సరాలుగా ఎక్కువ సంఖ్యలో తెలుగు వారు విద్య, ఉపాధి అవకాశాల కోసం పోలాండ్ వస్తూ ఉండటాన్ని గమనించి, తెలుగు వారి కోసం ఒక సంస్థ ఉండాలని భావించారు పోటా (PoTA) వ్యవస్థాపకులు రావ్ మద్దుకూరి, హరిచంద్ కాట్రగడ్డ, విజయ్ మోహన్, చంద్రభాను అక్కల.

PP.jpg

భారీ జనసందోహం నడుమ పోటా ప్రారంభోత్సవ వేడుకలు మార్చ్ 26 వ తేదీన ఘనంగా జరిగాయి. తెలుగు వారి కోసం పోలాండ్‌లో మొట్టమొదటి సారిగా జరిగిన ఈ వేడుకలకు పోలాండ్ నలుమూలల నుంచి తెలుగు వారు భారీగా తరలివచ్చారు. ఇలా విచ్చేసిన అతిథులకు వినోదాన్ని అందించేలా సాంస్కృతిక కార్యక్రమాలు, అసౌకర్యం లేకుండా భారీ ఏర్పాట్లు, కమ్మటి తెలుగు భోజనం, ఉగాది పచ్చడితో ఈ కార్యక్రమం కనుల పండువగా జరిగింది.

PPP.jpg

ఈ సందర్భంగా పోటా కార్యవర్గ ప్రకటన జరిగింది. మొదటి అధ్యక్షుడుగా అక్కల చంద్రభాను, ఉపాధ్యక్షురాలుగా శోభా కిరణ్, కోశాధికారిగా దిలీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. కమిటీ సభ్యులుగా మధుమతి, శ్రీనివాస్, ప్రకాష్, రాజశేఖర్, ధుమంత రావు, శైలేంద్ర, ప్రవీణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పోలాండ్‌లోని ప్రముఖ ఇండియన్ గ్రాసరీస్ సంస్థ లిటిల్ ఇండియా, ఉషోదయ గ్రూప్‌కి చెందిన ప్రియా ఫుడ్స్ సమర్పకులుగా వ్యవహరించారు.

Updated Date - 2023-03-30T19:20:42+05:30 IST