USA NRIs: తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్

ABN , First Publish Date - 2023-01-19T22:09:13+05:30 IST

శ్రీనాథ్ రావుల ఆధ్వర్యంలో అమెరికాలోని మేరిల్యాండ్‌లో ఎన్టీఆర్ (NTR) 27వ వర్థంతి ( NTR death anniversary) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

USA NRIs: తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్

కొనియాడిన ఎన్ఆర్ఐ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి, తదితరులు

మేరిల్యాండ్: శ్రీనాథ్ రావుల ఆధ్వర్యంలో అమెరికాలోని మేరిల్యాండ్‌లో ఎన్టీఆర్ (NTR) 27వ వర్థంతి ( NTR death anniversary) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి (Jayaram Komati) వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. సమాజంలో ప్రజల రూపంలో దేవుడిని చూసిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. రాజకీయాలలో పెత్తందారులకు కాకుండా చదువుకున్నవారికి, బీసీలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని ప్రశంసించారు. దశదిశలా తెలుగువారి ఖ్యాతిని పెంచారని, ప్రజల హృదయాల్లో నందమూరి తారక రామారావు చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.

Untitled-10.jpg

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. తెలుగువారి వాడి వేడి ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్ అని కీర్తించారు. పేదలకు కూడు, గూడు కల్పించారని, బీసీలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని మననం చేసుకున్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేశారన్నారు. వెండితెరపై దేవుడు, రాజకీయ వేదికపై నాయకుడు, ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.

Untitled-12.jpg

గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. విలువలతో కూడిన రాజకీయాలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. అక్రమ కేసులు, కక్షసాధింపులకే నేటి పాలకులు అధికారాన్ని వినియోగిస్తున్నారే తప్ప అభివృద్ధి పట్టడం లేదన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు నడుంబిగించాలని పిలుపునిచ్చారు.

నరిశెట్టి ఇన్నయ్య మాట్లాడుతూ.. రాజకీయాలతో సంబంధం లేని ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని అన్నారు. సామాజిక సేవా దృక్పథంతో సంక్షేమ రాజ్యాన్ని తీసుకువచ్చిన సంఘసంస్కర్త అని పొగిడారు. ప్రపంచంలో ఆంధ్రులను తిరుగులేని శక్తిగా మార్చడంలో ఎన్టీఆర్ నాటిన బీజాన్నిచంద్రబాబు మహావృక్షంగా మార్చారని పేర్కొన్నారు. జీడబ్ల్యూజీసీఎస్ మాజీ అధ్యక్షులు సుబ్బారాయుడు జక్కంపూడి, రాజా రావులపల్లి మాట్లాడుతూ.. అమెరికాలో ఎన్టీఆర్ పర్యటన సందర్భంగా ఆయనతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నామని గుర్తుచేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. రాజశేఖర్ చెరుకూరి, నాగప్రసాద్ గనపనేని, శ్రీనివాస్ సామినేని, వెంకట్ కూకట్ల తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. కాగా శివ నాగ మహేష్ నెలకుదిటి, రమేష్ నూతక్కి, జానకి రామ్ బోగినేని, కిషోర్ కంచర్ల, గోపీకృష్ణ అమిరినేని, గుండూరి యశ్వంత్, శివ నెల్లూరి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Untitled-9.jpg

Updated Date - 2023-01-19T22:11:03+05:30 IST