Share News

TANA: డెట్రాయిట్‌లో 'తానా' ప్రతినిధులకు సన్మానం

ABN , First Publish Date - 2023-10-25T06:40:50+05:30 IST

2023-25 కాలానికి గానూ 'తానా' తరఫున డెట్రాయిట్‌లోని శ్రీ వేంకటేశ్వర ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా బేతంచర్ల ప్రసాద్ నియమితులయ్యారు.

TANA: డెట్రాయిట్‌లో 'తానా' ప్రతినిధులకు సన్మానం

TANA: 2023-25 కాలానికి గానూ 'తానా' తరఫున డెట్రాయిట్‌లోని శ్రీ వేంకటేశ్వర ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా బేతంచర్ల ప్రసాద్ నియమితులయ్యారు. బ్లూమ్‌ఫీల్డ్ హిల్స్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసాద్‌ను తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ సత్కరించారు. ఆలయానికి విశేష సేవలు అందించిన ప్రసాద్‌ను ఈ పదవి వరించడం పట్ల అతిథులు హర్షం వ్యక్తం చేశారు. తానా కార్యాలయ సంచాలకుడు కోడూరు చలపతి, సాంస్కృతిక విభాగ అధ్యక్షురాలు గొంది మను, వెబ్‌సైట్ ఉపాధ్యక్షుడు దేవబత్తిని హరి తదితరులను కూడా ఈ కార్యక్రమంలో సత్కరించారు. సన్నీరెడ్డి, యద్దం బాలాజీ, బడ్డి అశోక్, ట్రాయి తెలుగు సంఘం ప్రతినిధులు చెంచు రెడ్డి, ఆలపాటి కృష్ణ ప్రసాద్, జంపాల విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-25T06:40:50+05:30 IST