Covid: మహారాష్ట్రలో కరోనాతో ముగ్గురి మృతి, 24గంటల్లో 562 కేసులు నమోదు

ABN , First Publish Date - 2023-04-03T07:41:12+05:30 IST

దేశంలో మళ్లీ కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతోందా అంటే అవునంటున్నాయి మహారాష్ట్ర వైద్యాధికారులు...

Covid: మహారాష్ట్రలో కరోనాతో ముగ్గురి మృతి, 24గంటల్లో 562 కేసులు నమోదు
Maharashtra Covid deaths

ముంబయి: దేశంలో మళ్లీ కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతోందా అంటే అవునంటున్నాయి మహారాష్ట్ర వైద్యాధికారులు...మహారాష్ట్రలో(Maharashtra) గడచిన 24 గంటల్లో కొవిడ్ వైరస్ వల్ల తాజాగా ముగ్గురు మరణించడం సంచలనం రేపింది.(Three deaths) గత 24 గంటల్లో 562 కరోనా కేసులు(Covid cases) తాజాగా నమోదయ్యాయి. దీంతో ఒక్క మహారాష్ట్రలోనే యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,488కి చేరుకుంది. ఆర్థిక రాజధాని నగరంగా పేరొందిన ఒక్క ముంబయిలోనే 24 గంటల్లో 172 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి.మహారాష్ట్రలోని ముంబయి(Mumbai) జిల్లాలో 1,070 కొవిడ్ పాజిటివ్ కేసులు,పూణే జిల్లాలో 766, థానే జిల్లాలో 616 కేసులు నమోదైనాయి.

ఇది కూడా చదవండి : Earthquake: పాపువా న్యూ గినియాలో భారీ భూకంపం

గతంలోనూ ముంబయి కేంద్రంగా కరోనా కేసుల వ్యాప్తి మొదలై దేశవ్యాప్తంగా ప్రబలింది. ఇప్పటికే మహారాష్ట్రలో పాజిటివ్ కొవిడ్ రేటు శాతం 9.4కు చేరింది. గత 24 గంటల్లో 395 మంది కరోనా రోగులు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా స్ట్రెయిన్ ను గుర్తించడానికి జన్యుపరీక్షలపై దృష్టి సారించాలని ఫోర్టిస్ హాస్పిటల్ ములుండ్ క్రిటికల్ కేర్ హెడ్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వైశాలి సోలావో సూచించారు. మహారాష్ట్రలో కొవిడ్ -19 కేసుల్లో తీవ్ర పెరుగుదల ఆందోళన కలిగిస్తోందని ఎస్‌ఎల్ రహేజా హాస్పిటల్ క్రిటికల్ కేర్ కన్సల్టెంట్, హెడ్ డాక్టర్ సంజిత్ శశీధరన్ అన్నారు.విమానాశ్రయాలు, దేశంలోకి ప్రవేశించే ఇతర ప్రదేశాల్లో కరోనా పరీక్షల శాతాన్ని పెంచాలని వైద్యులు సూచించారు.

Updated Date - 2023-04-03T07:42:47+05:30 IST