Share News

Sanjay Raut: షిండే హమాస్‌తో సమానం.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎంపీ

ABN , First Publish Date - 2023-10-25T11:36:19+05:30 IST

ఉద్ధవ్ ఠాక్రే(Uddav Tackrey) శివసేన(Shivsena) వర్గంపై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన కామెంట్స్ పై తాజాగా ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) స్పందించారు.

Sanjay Raut: షిండే హమాస్‌తో సమానం.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎంపీ

ముంబయి: ఉద్ధవ్ ఠాక్రే(Uddav Tackrey) శివసేన(Shivsena) వర్గంపై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన కామెంట్స్ పై తాజాగా ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) స్పందించారు. ముంబయిలోని(Mumbai) ఆజాద్ మైదాన్‌లో జరిగిన దసరా ర్యాలీలో షిండే చేసిన వ్యాఖ్యలపై రౌత్ స్పందించారు. ఏక్ నాథ్ షిండే హమాస్ తో సమానమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


షిండే తో పాటు, ఆయన మిత్ర పక్షం బీజేపీ(BJP)పై సైతం రౌత్ విరుచుకుపడ్డారు. షిండే స్వయంగా హమాస్(Hamas) అని.. ఆయన మనసులో బీజేపీ విష పురుగులను నాటిందని ఎద్దేవా చేశారు. వారి స్వార్థం కోసం ఏక్ నాథ్ షిండే వర్గం తమను హమాస్, లష్కరే తోయిబా(Lashkar-e-Taiba)తో ముడిపెడతారని అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గంపై సీఎం ఇటీవల వివాదాస్పద కామెంట్లు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఠాక్రే వర్గం తమ స్వార్థం కోసం హమాస్, లష్కరే తోయిబాతో సైతం చేతులు కలపగలదని వివాదాస్పద కామెంట్లు చేశారు. రెండుగా చీలిన శివసేన పార్టీ నేతలు ఠాక్రే, షిండేలు పార్టీ చరిత్రలో తొలిసారిగా ముంబయిలో ఈ ఏడాది వేర్వేరుగా దసరా ర్యాలీలు నిర్వహించారు.

Updated Date - 2023-10-25T11:36:56+05:30 IST