Share News

Droupadi Murmu: రాష్ట్రపతిని కలిసి దీపావళి శుభాకాంక్షలు చెప్పిన మోదీ

ABN , First Publish Date - 2023-11-12T20:07:43+05:30 IST

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు కలుసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి శుభాకాంక్షలు చెప్పారు.

Droupadi Murmu: రాష్ట్రపతిని కలిసి దీపావళి శుభాకాంక్షలు చెప్పిన మోదీ

న్యూఢిల్లీ: దీపావళి (Diwali) పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆదివారంనాడు కలుసుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీలు రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు. జగ్‌దీప్ ధన్‌ఖడ్ తన భార్య డాక్టర్ సుదేశ్ ధన్‌ఖడ్‌తో కలిసి రాష్ట్రపతిని కలిసారు.

Updated Date - 2023-11-12T20:07:45+05:30 IST