Share News

NCERT: ఎన్సీఈఆర్టీ సంచలన నిర్ణయం.. పుస్తకాల్లో ఆ పదం తొలగింపు

ABN , First Publish Date - 2023-10-25T15:06:30+05:30 IST

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పుస్తకాల్లో ఇండియా(INDIA) అనే పేరు వాడవద్దని ప్యానెల్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇండియా స్థానంలో భారత్ అనే పేరు మాత్రమే వాడాలని మార్గదర్శకాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారం.. ఇండియా అంటే భారత్ యూనియన్ అని నిర్వచించింది

NCERT: ఎన్సీఈఆర్టీ సంచలన నిర్ణయం.. పుస్తకాల్లో ఆ పదం తొలగింపు

ఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పుస్తకాల్లో ఇండియా(INDIA) అనే పేరు వాడవద్దని ప్యానెల్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇండియా స్థానంలో భారత్ అనే పేరు మాత్రమే వాడాలని మార్గదర్శకాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారం.. ఇండియా అంటే భారత్ యూనియన్ అని నిర్వచించింది. ఎన్సీఈఆర్టీ ప్యానెల్ చేసిన ప్రతిపాదనను సభ్యులు ఆమోదించడంతో ఇకపై పుస్తకాల్లో ఇండియా అనే పేరు మాయం కానుంది. ప్యానెల్ సభ్యుల్లో ఒకరైన ఇస్సాక్ మాట్లాడుతూ.. కొత్త పుస్తకాల్లో పేర్లు మార్చాలని గతంలోనే ప్రతిపాదన ఉండిందని.. ఇప్పుడు ఆమోదం తెలపడంతో ప్రతిపాదన అమల్లోకి రానున్నట్లు చెప్పారు.


అయితే ప్రతిపక్ష కూటమికి ఇండియా అనే పేరు పెట్టినప్పటి నుంచి దేశంలోని చాలా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇండియా అనే పేరు వాడట్లేదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) జీ 20 విందు ఆహ్వాన పత్రికలో కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరుకు బదులు భారత రాష్ట్రపతి అని ఉండటంతో వివాదానికి దారి తీసింది. సెప్టెంబర్ లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో జరిగిన జీ 20 లీడర్స్ సమ్మిట్ లో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నప్పుడు టేబుల్ పై భారత్ నేమ్ ప్లేట్ ని ప్రదర్శించారు. ఇలా చాలా ప్రాంతాల్లో పేరు మార్పు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న కాంగ్రెస్, తమ కూటమిని చూసి మోదీ భయపడుతున్నారని ఎద్దేవా చేసింది. తాజాగా ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో సైతం పేర్లు మార్చడంపై ఇండియా కూటమి(INDIA Alliance) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


హిందూ ధర్మం విజయాలు..

ఇండియా పదాన్ని తొలగించడమే కాకుండా.. హిందూ ధర్మం సాధించిన విజయాలు హైలెట్ చేయాలని సిఫారసు చేయడం మరింత వివాదానికి దారి తీసింది. పుస్తకాల్లో ఓల్డ్ హిస్టరీకి బదులు.. క్లాసికల్ చరిత్ర ప్రవేశపెట్టాలని కమిటీ సిఫారుసు చేసింది. బ్రిటిష్ వారి మరకల్ని శాశ్వతంగా దూరం చేయడానికే పేర్లు మారుస్తున్నట్లు ఇన్సాక్ తెలిపారు. అన్ని పాఠ్యాంశాల్లో భారతీయ నాలెడ్జ్ సిస్టమ్ ప్రవేశపెట్టాలని కూడా కమిటీ సిఫారుసు చేసింది. అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటములకు తాజా ఘటన మరో రాజకీయ అస్త్రం అయింది.

Updated Date - 2023-10-25T15:45:58+05:30 IST