Sudha Murty: నా కూతురు భర్తను ప్రధానమంత్రిని చేసింది...యూకే ప్రధాని రిషి సునక్ అత్త సుధామూర్తి వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-04-28T12:01:24+05:30 IST

బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ అత్త, ప్రముఖ సంఘసేవకురాలు సుధామూర్తి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....

Sudha Murty: నా కూతురు భర్తను ప్రధానమంత్రిని చేసింది...యూకే ప్రధాని రిషి సునక్ అత్త సుధామూర్తి వ్యాఖ్యలు
Rishi Sunak,Akshata Murty,Sudha Murty

లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ అత్త, ప్రముఖ సంఘసేవకురాలు సుధామూర్తి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(Sudha Murty) తన కుమార్తె అక్షతా మూర్తి అతి పిన్న వయసులోనే భర్తను ప్రధానమంత్రిని చేసిందని సుధా మూర్తి ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతున్న వీడియోలో పేర్కొన్నారు.(Rishi Sunak,Akshata Murty) ‘‘నేను నా భర్తను వ్యాపారవేత్తను చేశాను, నా కుమార్తె భర్తను యూకే ప్రధానిని చేసింది’’ అని వీడియోలో సుధామూర్తి చెప్పారు. భార్య భర్తను ఎలా మారుస్తుందో చూడండి...కానీ నేను నా భర్తను మార్చలేక పోయానన్నారు.రిషి సునక్ 2009వ సంవత్సరంలో అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సంవత్సరాల్లో రిషి ప్రధాన మంత్రి అయ్యారు.

ఇది కూడా చదవండి : WFI Sexual Harassment Case: న్యాయం చేయాలి...రెజ్లర్లకు నీరజ్ చోప్రా మద్ధతు

ప్రపంచంలోని అత్యంత సంపన్న బిలియనీర్‌లలో ఒకరైన అక్షతామూర్తి 730 మిలియన్ పౌండ్ల సంపదతో శక్తివంతమైన మహిళగా నిలిచారు. అక్షితామూర్తి తల్లిదండ్రులు నారాయణ మూర్తి, సుధామూర్లిలు. వీరికి బిలియన్ల విలువైన టెక్ కంపెనీ ఉంది. అక్షతా మూర్తి తండ్రి నారాయణ మూర్తి భారతదేశపు అత్యంత సంపన్నులలో ఒకరు. ఇన్ఫోసిస్ టెక్ కంపెనీ స్థాపకుడు. తన కుమార్తె ప్రధానమంత్రి రిషి జీవితం, ఆహారపు అలవాట్లను మార్చిందని పేర్కొన్నారు. నారాయణమూర్తి కుటుంబం ప్రతి గురువారం ఉపవాసం ఉండే సంప్రదాయాన్ని పాటిస్తోంది.దీంతో తమ అల్లుడు రిషి కూడా గురవారాల్లో ఉపవాసం ఉంటున్నాడని సుధామూర్తి చెప్పారు.

Updated Date - 2023-04-28T12:07:18+05:30 IST