MLA: ఒక్క రాష్ట్రంలో గెలిస్తే దేశం గెలిచినట్టు కాదు.. అది గుర్తుపెట్టుకోండి...

ABN , First Publish Date - 2023-08-06T13:28:46+05:30 IST

రాష్ట్రంలో గెలిచినంత మాత్రాన దేశాన్ని గెలిచి నట్టు కాదని కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే బీవై విజయేంద్ర(MLA BY Vijayendra) వ్యాఖ్యానించారు.

MLA: ఒక్క రాష్ట్రంలో గెలిస్తే దేశం గెలిచినట్టు కాదు.. అది గుర్తుపెట్టుకోండి...

దొడ్డబళ్ళాపుర(బెంగళూరు): రాష్ట్రంలో గెలిచినంత మాత్రాన దేశాన్ని గెలిచి నట్టు కాదని కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే బీవై విజయేంద్ర(MLA BY Vijayendra) వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్యారెంటీ పథకాల అమలుకోసం ఎస్సీ, ఎస్టీ గ్రాంట్లను సైతం వినియోగిస్తుండడం ద్వారా వారి సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. పట్టణంలోని బసవ భవన్‌లో వీరశైవ లింగాయత సమాజం ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటైన గురువందనలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో లాగేసుకుంటోందని ఇది ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. కాగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బూడిద కానుందని వీరప్ప మొయిలీ(Veerappa Moily) వ్యాఖ్యానించడంపై స్పందిస్తూ కాంగ్రెస్‌ వారు పగటి కలలు కంటున్నారన్నారు. కర్ణాటక లో అధికారంలోకి వచ్చినం త మాత్రాన దేశమంతా గెలిచిన భ్రమలో ఉన్నారన్నారు. రాష్ట్రంలో 25 స్థానాలు గెలవడంతోపాటు మరోసారి ప్రధాని నరేంద్రమోదీ కావడం ఖాయమన్నారు.

Updated Date - 2023-08-06T13:28:46+05:30 IST