Share News

Lok Sabha Security Breach: పార్లమెంటులో అలజడి.. పోలీసు కస్టడీకి కీలక నిందితుడు లలిత్ ఝా

ABN , Publish Date - Dec 15 , 2023 | 05:19 PM

పార్లమెంటులో అలజడికి సంబంధించి కీలక నిందితుడిగా భావిస్తున్న లలిత్ ఝాను పాటియాలా హౌస్ కోర్టు శుక్రవారంనాడు ఏడు రోజుల పోలీస్ కస్టడీకి పంపింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ సెల్ ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతోంది.

Lok Sabha Security Breach: పార్లమెంటులో అలజడి.. పోలీసు కస్టడీకి కీలక నిందితుడు లలిత్ ఝా

న్యూఢిల్లీ: పార్లమెంటులో అలజడికి (Parliament Security breach) సంబంధించి కీలక నిందితుడిగా భావిస్తున్న లలిత్ ఝా (Lalit Jha)ను పాటియాలా హౌస్ కోర్టు శుక్రవారంనాడు ఏడు రోజుల పోలీస్ కస్టడీకి పంపింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ సెల్ ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతోంది.


కోల్‌కతాకు చెందిన టీచర్ లలిత్ ఝా గురువారం సాయంత్రం పోలీసులకు లొంగిపోవడంతో వెంటనే అతన్ని అరెస్టు చేశారు. భద్రతా ఉల్లంఘనల ఘటనకు తెరవెనుక సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝూ పోలీసు విచారణలో కీలక వివరాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు పట్టుబడగా, వారిలో నలుగురిని ఏడు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. 2001 పార్లమెంటుపై దాడి ఘటన 22వ వార్షికోత్సవం రోజైన డిసెంబర్ 13న ఇద్దరు ఆగంతకులు లోక్‌సభలో గలభా సృష్టించడం సంచలనమైంది. గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూకిన ఆగంతకులు ఒక రకమైన గ్యాస్ వదులుతూ అలజడి రేపడంతో ఎంపీలు భయాందోళనలకు గురయ్యారు. అంతలోనే తేరుకుని ఆ ఇద్దర్నీ పట్టుకున్నారు. పార్లమెంటు వెలుపల ఆందోళనకు దిగిన మరో ఇద్దరు నిరసనకారులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - Dec 15 , 2023 | 05:19 PM