Home » Security Breach
భారత్ జోడో న్యాయ్ యాత్ర అసోం పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఎదరవుతున్న భద్రతా లోపాలపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన చొరవ తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఖర్గే కోరారు.
ఈనెల 13న ఇద్దరు వ్యక్తులు పార్లమెంటు భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన ఘటనతో చిక్కుల్లో పడిన మైసూలు లోక్సభ నియోజకవర్గం బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఆదివారంనాడు తొలిసారి స్పందించారు. తాను దేశ భక్తుడనో, ద్రోహినో భగవంతుడికి మాత్రమే తెలుసునని అన్నారు. సింహా కార్యాలయం నుంచే ఇద్దరు నిందితులిద్దరూ పాస్లు పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి.
దేశంలోని యువత ఉద్యోగాలు లేక, నిరుద్యోగిత కారణంగా ఫేస్బుక్, ఇన్స్ట్రాగ్రామ్లలో ఎక్కువ సమయం తలమునకలవుతున్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. పార్లమెంటు భద్రతా వైఫల్యం మరో ప్రశ్నను కూడా లేవనెత్తిందని, ఈ తరహా నిరసనలకు కారణమేమిటనేదే ఆ ప్రశ్న అని, దేశంలోని నిరుద్యోగితే ఈ ప్రశ్నకు సమాధానమని ఆయన చెప్పారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై కాంగ్రెస్ పార్టీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుండి ప్రకటన కోరినందున ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారు కానీ..
పార్లమెంటు భద్రతా ఉల్లంఘన అంశంపై ఉభయసభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనలతో ఉభయ సభల కార్యకలాపాలు నిలిచిపోవడంతో సోమవారంనాడు 78 ఎంపీలపై సస్పెన్షన్ల వేటు పడింది. దీంతో ఇప్పటివరకూ ఉభయసభల్లో సస్పెన్షన్ వేటు పడిన ఎంపీల సంఖ్య 92కు చేరింది.
పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన తీవ్రమైనదని, దీనిపై చర్చ అవసరం లేదని, సమగ్ర విచారణ జరగాలని ప్రధాన మంత్రి మోదీ పిలుపునిచ్చినప్పటికీ ఉభయసభల్లో ప్రతిపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్షా ఒక ప్రకటన చేయాలని విపక్ష ఎంపీలు పట్టువిడుపులు లేని ధోరణిలో ఆందోళన సాగిస్తుండటంతో తాజాగా 30 మందికి పైగా ఎంపీలు సస్పెండయ్యారు.
పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో డిసెంబర్ 13న పలువురు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి స్మోక్ గన్స్ విసిరిన(Parliament Security Breach) విషయం విదితమే.
పార్లమెంటులో అలజడికి సంబంధించి కీలక నిందితుడిగా భావిస్తున్న లలిత్ ఝాను పాటియాలా హౌస్ కోర్టు శుక్రవారంనాడు ఏడు రోజుల పోలీస్ కస్టడీకి పంపింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ సెల్ ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతోంది.
పార్లమెంటులో బుధవారం తలెత్తిన భద్రతా వైఫల్యాన్ని కేంద్రం సీరియస్గా తీసుకుంది. అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. పార్లమెంటు భద్రతా నిబంధనల్లో మార్పులు చేపట్టింది. లోక్సభలోకి సందర్శకుల గ్యాలరీ నుంచి ఆగంతకులు లోపలకు దూకి స్మోక్ గ్యాస్ వదలడం, బెంచీలపై దూకుతూ పరుగులు తీయడం ఎంపీలను భయభ్రాంతులను చేసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2022 జనవరి 5న పంజాబ్ లో జరిపిన పర్యటనలో భద్రతా లోపంపై బడిండా ఎస్పీ గుర్వీందర్ సింగ్ సంఘాను సస్పెండ్ చేశారు. పంజాబ్ హోం మంత్రిత్వ శాఖ శనివారంనాడు ఈ విషయం తెలిపింది.