Budget2023: పండగ చేసుకునే ప్రకటన వచ్చేసింది.. ఇక వాళ్లకు ఫుల్ హ్యాపీ..

ABN , First Publish Date - 2023-02-01T12:29:21+05:30 IST

వేతనజీవులు, మధ్యతరగతివర్గాల ఆశ ఫలించింది. పన్నుమినహాయింపు కనిష్ఠ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెరిగింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

 Budget2023: పండగ చేసుకునే ప్రకటన వచ్చేసింది.. ఇక వాళ్లకు ఫుల్ హ్యాపీ..

న్యూఢిల్లీ: వేతనజీవులు, మధ్యతరగతివర్గాలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆశ ఫలించింది. వ్యక్తిగత ఆదాయ పన్నుమినహాయింపు కనిష్ఠ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతూ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 స్లాబుల్లో పన్ను విధించనున్నారు. రూ.7 - రూ.9 లక్షల వరకు 5 శాతం పన్ను, ఆదాయం రూ.30 లక్షలు దాటితే 30 శాతం పన్ను విధింపునకు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అయితే ఇది నూతన పన్ను విధానానికి మాత్రమే వర్తిస్తుంది. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలనేది పూర్తిగా చెల్లింపుదారుడి ఐచ్ఛికం. ఎందులో ప్రయోజనం ఉంటుందనుకుంటే దానిని ఎంపిక చేసుకోవచ్చు. కాగా పన్ను మినహాయింపులకు సంబంధించి ఆర్థిక నిపుణుల అంచనాలు దాదాపు నిజమయ్యాయి. రెండేళ్లక్రితం ప్రవేశపెట్టిన నూతన పన్ను విధానంలో వేతన జీవులకు ఆకర్షించడమే లక్ష్యంగా స్లాబుల్లో మార్పులు జరగొచ్చునని మొదటి నుంచి విశ్లేషకులు చెబుతూ వచ్చారు. దాదాపు ఇప్పుడు అదే జరిగింది.

వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లు...

0 నుంచి రూ. 3 లక్షలు - సున్నా

రూ. 3 లక్షలు నుంచి రూ.6 లక్షలు - 5 %

రూ. 6 లక్షలు నుంచి రూ.9 లక్షలు - 10%

రూ. 9 లక్షల నుంచి రూ.12 లక్షలు - 15%

రూ. 12 లక్షల నుంచి రూ.15 లక్షలు - 20%

రూ. 15 లక్షల పైబడిన ఆదాయం - 30%

Updated Date - 2023-02-01T15:13:15+05:30 IST