Share News

Karnataka: ఏ క్షణమైనా సిద్ధరామయ్య సర్కార్ కూలిపోవచ్చు.. కుమారస్వామి సంచలన కామెంట్స్

ABN , First Publish Date - 2023-12-11T15:49:30+05:30 IST

కర్ణాటకలోని కాంగ్రెస్(Congress) సర్కార్ ఏ క్షణమైనా కూలిపోవచ్చని జనతాదళ్ సెక్యులర్(JDU) అధ్యక్షుడు హెచ్ డీ కుమార్ స్వామి(Kumara Swami) హెచ్చరించారు.

Karnataka: ఏ క్షణమైనా సిద్ధరామయ్య సర్కార్ కూలిపోవచ్చు.. కుమారస్వామి సంచలన కామెంట్స్

బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్(Congress) సర్కార్ ఏ క్షణమైనా కూలిపోవచ్చని జనతాదళ్ సెక్యులర్(JDU) అధ్యక్షుడు హెచ్ డీ కుమార్ స్వామి(Kumara Swami) హెచ్చరించారు. సోమవారం ఆయన బెంగళూరులో మాట్లాడుతూ.. సిద్ధరామయ్య(CM Siddaramaiah) సర్కార్ పనితీరు బాగలేదన్నారు.

"ఒక మంత్రి తన వెంట 50-60 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుని బీజేపీలో చేరే అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వం కూలిపోతుంది. అందరిలో విధేయత, నిజాయతీ మిగిలిలేవు. రాష్ట్రంలో 6 నెలలుగా అభివృద్ధి జరగట్లేదు. ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది" అని అన్నారు.

ఖండించిన సిద్ధరామయ్య..

కుమార స్వామి వ్యాఖ్యలను సీఎం సిద్ధరామయ్య ఖండించారు. బీజేపీ, జేడీఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందనే భ్రమలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పోరాడేందుకు ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని విమర్శించారు.

Updated Date - 2023-12-11T15:50:37+05:30 IST