Cancellation of trains: తిరుపతి - కాట్పాడి సహా ఆరు ప్యాసింజర్ రైళ్ల రద్దు
ABN , First Publish Date - 2023-09-22T09:05:46+05:30 IST
ఆంధ్ర రాష్ట్రం గుంతకల్లు రైల్వే డివిజన్లో రైలుమార్గం మరమ్మతుల కారణంగా ఈ నెల 24వ తేది వరకు ఆరు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఐసిఎఫ్(చెన్నై): ఆంధ్ర రాష్ట్రం గుంతకల్లు రైల్వే డివిజన్లో రైలుమార్గం మరమ్మతుల కారణంగా ఈ నెల 24వ తేది వరకు ఆరు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. తిరుపతి - కాట్పాడి ఉదయం 6.45 గంటలు, కాట్పాడి - తిరుపతి రాత్రి 9.50 గంటలు ప్యాసింజర్ రైళ్లు, కాట్పాడి - జోలార్పేట ఉదయం 9.30 గంటలు, జోలార్పేట - కాట్పాడి మధ్యాహ్నం 12.40 గంటలు, విల్లుపురం - తిరుపతి ఉదయం 5.30 గంటల రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.