Maneka Gandhi: ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకురాలు మనేకా గాంధీకి గాయాలు..

ABN , First Publish Date - 2023-05-02T18:42:39+05:30 IST

ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీజేపీ నాయకురాలు మనేకా గాంధీ గాయపడ్డారు.

Maneka Gandhi: ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకురాలు మనేకా గాంధీకి గాయాలు..
BJP leader Maneka Gandhi

సుల్తాన్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) పురపాలక ఎన్నికల (civic body elections) ప్రచారానికి వెళ్లిన బీజేపీ నాయకురాలు మనేకా గాంధీ (BJP leader Maneka Gandhi) గాయపడ్డారు. సుల్తాన్ పూర్ నియోజకవర్గంలో ఘాజీగంజ్ వార్డ్‌లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు వెళ్లిన సమయంలో కారు దిగి నడుస్తుండగా ఆమె రోడ్డుపై జారిపడ్డారు. ఆమెకు స్వల్పంగా గాయాలయ్యాయని బీజేపీ శ్రేణులు తెలిపాయి. యూపీలో రెండు రోజులుగా ఏకధాటిగా వానలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఉత్తరప్రదేశ్‌లో మే 4, మే 11 తేదీల్లో పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీల నేతలు ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తరపున ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో(Yogi) పాటు మంత్రులు, సీనియర్ నేతలు ప్రచారం చేస్తుండగా, సమాజ్‌వాదీ తరపున అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) తదితరులు ప్రచారం చేస్తున్నారు. మే 13న పురపాలక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Updated Date - 2023-05-02T18:42:42+05:30 IST