Bengalore to Narasapuram: బెంగళూరు నుంచి నరసాపురానికి వేసవి ప్రత్యేక రైలు

ABN , First Publish Date - 2023-05-03T12:34:56+05:30 IST

నైరుతి రైల్వేజోన్‌ వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని నరసాపురానికి ప్రత్యేక రైలు నడపాలని నిర్ణయించుకుంది. 07154 రైలు ఎస్‌ఎంవీటీ బెంగళూరు స్టేషన్‌

Bengalore to Narasapuram: బెంగళూరు నుంచి నరసాపురానికి వేసవి ప్రత్యేక రైలు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): నైరుతి రైల్వేజోన్‌ వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని నరసాపురానికి ప్రత్యేక రైలు నడపాలని నిర్ణయించుకుంది. 07154 రైలు ఎస్‌ఎంవీటీ బెంగళూరు స్టేషన్‌ నుంచి ప్రతి శనివారం ఉదయం 10.50గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నరసాపురానికి చేరుకుంటుంది. బెంగళూరు నుంచి మే 27వరకు మొత్తం నాలుగు ట్రిప్‌లు ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు. ఈరైలు కృష్ణరాజపురం, బంగారపేట, జోలార్‌పేట, కాట్పాడి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు(Renigunta, Gudur, Nellore, Kavali, Ongole), చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, గుడివాడ(Vijayawada, Gudivada), కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్‌, భీమవరం జంక్షన్‌, వీరవాసరం, పాలకొల్లుల మీదుగా నరసాపురానికి చేరుకుంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2023-05-03T12:38:28+05:30 IST