Bangalore: ఉపముఖ్యమంత్రితో బీజేపీ నేత కుమార్తె భేటీ

ABN , First Publish Date - 2023-07-26T12:43:44+05:30 IST

ప్రముఖ బీజేపీ నేత, మాజీ మంత్రి సీపీ యోగీశ్వర్‌(Former minister CP Yogeshwar) కుమార్తె, నటి నిశా(Actress Nisha) బెంగళూరులోని సదాశివనగర్‌లో మంగ

Bangalore: ఉపముఖ్యమంత్రితో బీజేపీ నేత కుమార్తె భేటీ

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ప్రముఖ బీజేపీ నేత, మాజీ మంత్రి సీపీ యోగీశ్వర్‌(Former minister CP Yogeshwar) కుమార్తె, నటి నిశా(Actress Nisha) బెంగళూరులోని సదాశివనగర్‌లో మంగళవారం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను భేటీ కావడం తీవ్ర కుతూహలం రేకెత్తిస్తోంది. మర్యాదపూర్వకంగానే డీసీఎంను కలసినట్లు నిశా చెబుతున్నప్పటికీ 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి సీపీ యోగీశ్వర్‌ తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుకునే అవకాశాలున్నాయన్న కథనాల నేపథ్యంలో డీసీఎంతో నిశా భేటీ చర్చనీయాంశంగా మారింది.

pandu7.jpg

Updated Date - 2023-07-26T12:43:44+05:30 IST