TSPSC paper leak: ఉన్నతాధికారుల వంతు వచ్చింది! సిట్ ఏం తేల్చనుందో!

ABN , First Publish Date - 2023-04-01T11:08:37+05:30 IST

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ (TSPSC paper leak) కేసులో కమిషన్‌ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి (Janardhan Reddy) సహా ఉన్నతాధికారులను

TSPSC paper leak: ఉన్నతాధికారుల వంతు వచ్చింది! సిట్ ఏం తేల్చనుందో!
TSPSC paper leak

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డిని విచారించనున్న దర్యాప్తు సంస్థ!

సెక్రటరీ అనితా రామచంద్రన్‌కు నోటీసులు

కమిటీ సభ్యుడు లింగారెడ్డికి కూడా జారీ?

వీరివద్ద పీఏలుగా పనిచేస్తున్న ప్రవీణ్‌, రమేశ్‌

ఇప్పటికే పది విడతలు శంకరలక్ష్మి విచారణ

కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ కార్యకలాపాలపై ఆరా

హైదరాబాద్‌ సిటీ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ (TSPSC paper leak) కేసులో కమిషన్‌ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి (Janardhan Reddy) సహా ఉన్నతాధికారులను విచారించాలని సిట్‌ అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలుత సెక్రటరీ అనితా రామచంద్రన్‌ను విచారించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆమెకు నోటీసులు జారీ చేసింది. కార్యదర్శితోపాటు ప్రభుత్వం (TS Government) ఏర్పాటు చేసిన టీఎస్‌పీఎస్సీ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్న లింగారెడ్డికి కూడా సిట్‌ నోటీసులు జారీ చేసింది. వీరిని శనివారం ఉదయం విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. పేపర్ల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్‌.. టీఎ్‌సపీఎస్సీలో సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తుండటంతోపాటు.. సెక్రటరీ అనితా రామచంద్రన్‌కు పీఏగా కూడా ఉన్నాడు. దీంతో అతనికి టీఎస్‌పీఎస్సీ లోని అన్ని విభాగాల్లోనూ ఈజీగా యాక్సెస్‌ ఉండేది.

tspsdc.jpg

ఎక్కడికైనా సులభంగా వెళ్లగలిగేవాడు. దీనిని అవకాశంగా తీసుకున్న ప్రవీణ్‌ చాలా సులభంగా టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి కుట్ర చేసినట్లు సిట్‌ గుర్తించింది. ఇలా లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన ప్రవీణ్‌.. సెక్రటరీ వద్ద పీఏగా పనిచేస్తున్నందునే ఆమెను కూడా విచారించాలని సిట్‌ అధికారులు నిర్ణయించారు. మరోవైపు గ్రూప్‌-1 పేపర్‌ లీకేజీలో అరెస్టయిన రమేశ్‌.. డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా, టీఎ్‌సపీఎఎస్సీ కమిటీ సభ్యుడు లింగారెడ్డికి పీఏగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న రమేశ్‌ను పోలీసులు విచారించి కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సిట్‌ అధికారులు లింగారెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అనితా రామచంద్రన్‌, లింగారెడ్డిలను విచారించి, వారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్న అనంతరం కమిషన్‌ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డినీ విచారించనున్నట్లు తెలుస్తోంది.

20 గంటలపాటు శంకరలక్ష్మి విచారణ..

టీఎస్‌పీఎస్సీ లో ప్రశ్నపత్రాలను భద్రపరిచే కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఇచ్‌చార్జి శంకరలక్ష్మిని సిట్‌ అధికారులు ఇప్పటివరకు 10 విడతలు విచారించినట్లు సమాచారం. మొత్తం సుమారు 20 గంటలపాటు ఆమెను విచారించిన పోలీసులు కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లో జరిగే అన్ని కార్యకలాపాలపై వివరాలు సేకరించారు. ఈ క్రమంలో కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌పై శంకరలక్ష్మితోపాటు.. కమిషన్‌ సెక్రటరీ, చైర్మన్‌లకు మాత్రమే అజమాయిషీ ఉంటుందని తేలింది. ఈ నేపథ్యంలోనే చైర్మన్‌ను, సెక్రటరీని విచారించడానికి సిట్‌ సిద్ధమైనట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో అత్యధిక మార్కులు సాదించిన 121 మందిని సిట్‌ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 100 మంది అభ్యర్థులను విచారించి వారి స్టేట్‌ రికార్డు చేసినట్లు సిట్‌ అధికారులు వెల్లడించారు. మరో 21 మంది అభ్యర్థులనూ విచారించి వివరాలు తీసుకుంటామన్నారు. అభ్యర్థులకు ఉన్న ప్రతిభా సామర్థ్యాలతో పాటు.. వివిధ కోణాల్లో వివరాలను క్రాస్‌ చెక్‌ చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-04-01T11:08:37+05:30 IST