AP News: ఆదివారమే ఎస్‌ఐ రాత పరీక్ష.. ఈరోజే ఇలా చేయండి!

ABN , First Publish Date - 2023-02-18T13:05:11+05:30 IST

అభ్యర్థులు శనివారమే తమకు కేటాయించిన కేంద్రాలను సందర్శించాలని, పరీక్ష రోజు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని

AP News: ఆదివారమే ఎస్‌ఐ రాత పరీక్ష.. ఈరోజే ఇలా చేయండి!
ఈరోజే ఇలా చేయండి!

నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు

అభ్యర్థులు ఫోన్‌, వాచ్‌, పర్సులు కూడా తేకూడదు

నేడు పరీక్ష కేంద్రాలు చూసుకోవాలని సూచన

అమరావతి: సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల (Sub-Inspector Posts Recruitment) భర్తీకి ప్రాథమిక రాత పరీక్ష ఆదివారం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్మెంట్‌ బోర్డు (Police Recruitment Board) చైర్మన్‌ మనీష్‌ కుమార్‌ సిన్హా తెలిపారు. ఈ నెల 19న ఉదయం 10గంటలకు మొదటి పేపర్‌, 2.30నుంచి రెండో పేపర్‌ పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థులు శనివారమే తమకు కేటాయించిన కేంద్రాలను సందర్శించాలని, పరీక్ష రోజు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైనా, మొబైల్‌ (Mobile), ల్యాప్‌టాప్‌ (Laptop), బ్లూటూత్‌ (Bluetooth), పెన్‌డ్రైవ్‌ (pen drive), స్మార్ట్‌ వాచ్‌ (Smart watch), కాలిక్యులేటర్‌ (Calculator), లాగ్‌ టేబుల్‌, పర్స్‌ కూడా అనుమతించబోమని చెప్పారు. అభ్యర్థులు హాల్‌ టికెట్‌ (Hall Ticket)తో పాటు ఆధార్‌, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లాంటి గుర్తింపు కార్డు ఏదో ఒకటి తీసుకు రావాలన్నారు. పరీక్ష రాసేందుకు బ్లాక్‌ లేదా బ్లూ పాయింట్‌ పెన్‌లు మాత్రమే తెచ్చుకోవాలని, అనుమతి లేని వస్తువులను వెంట తెచ్చుకుని కేంద్రాల ఇబ్బందులు పడొద్దని సూచించారు. కాగా, గత నవంబరు 28న విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం 411ఎస్‌ఐ పోస్టులకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Viral Video: బైక్‌పై ఈ కోతులు ఎంత బుద్ధిగా కూర్చున్నాయో.. డ్రైవింగ్ చేసిన కుర్రాడి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!

Updated Date - 2023-02-18T13:15:00+05:30 IST