ఆ ఒక్క నిజం తెలియడంతో భార్యను దారుణంగా చంపేసిన భర్త!

ABN , First Publish Date - 2023-01-26T16:34:46+05:30 IST

తన కుమారుడి వయసున్న యువకుడితో తన భార్య నీలమ్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయం తెలిసి శరత్ తట్టుకోలేకపోయాడు.

ఆ ఒక్క నిజం తెలియడంతో భార్యను దారుణంగా చంపేసిన భర్త!

గోరఖ్‌పూర్: కుమారుడి వయసున్న యువకుడితో తన భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయం తెలుసుకున్న భర్త ఆమెను గొంతునులిమి హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని గోరఖ్‌పూర్‌(Gorakhpur)లో జరిగింది. భార్యను చంపేసిన అనంతరం నిదానంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

నిందితుడిని రాజ్‌ఘాట్ ప్రాంతంలోని ఖుర్రమ్‌పూర్‌కు చెందిన శరత్‌చంద్రపాల్‌గా గుర్తించారు. తన కుమారుడి వయసున్న యువకుడితో తన భార్య నీలమ్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయం తెలిసి శరత్ తట్టుకోలేకపోయాడు. దీంతో గొంతు నులిమి ఆమెను దారుణంగా చంపేశాడు.

ఆ తర్వాత రాజ్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పి లొంగిపోయాడు. ‘‘నేను నా భార్యను చంపేశాను. నన్ను అరెస్ట్ చేయండి’’ అని పోలీసులకు చెప్పడంతో వారు షాకయ్యారు. ఆ తర్వాత తేరుకుని అతడితో కలిసి ఇంటికెళ్లారు. అక్కడ అతడి భార్య నీలమ్ నిర్జీవంగా పడి ఉండడంతో నిందితుడు శరత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం జరిగిన విచారణలో నిందితుడు మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాడు. తన కుమారుడి కంటే చిన్నవాడైన 25 ఏళ్ల వయసున్న యువకుడితో తన భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు చెప్పాడు. ఈ విషయంలో తమ ఇద్దరి మధ్య చాలాసార్లు గొడవ జరిగిందన్నాడు. తాను పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానని, అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదన్నాడు.

బుధవారం ఇంట్లో పిల్లలు లేని సమయంలో ఇదే విషయంలో భార్యభర్తలు మరోమారు గొడవ పడ్డారు. అది మరింత ముదరడంతో సహనం కోల్పోయిన భర్త ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని లొంగిపోయాడు. నిందితుడిని అరెస్ట్ చేశామని, పోస్టుమార్టం రిపోర్టు రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-01-26T16:34:48+05:30 IST