Share News

Yuvagalam Padaytra: లోకేష్ యువగళం పున: ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే..

ABN , First Publish Date - 2023-11-20T07:53:16+05:30 IST

ఈ నెల 24వ తేదీ నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పున: ప్రారంభం కానుంది. విశాఖలో పాదయాత్రను ముగించే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో సెప్టెంబర్ 9వ తేదీన యువగళం పాదయాత్ర నిలిచిపోయింది.

Yuvagalam Padaytra: లోకేష్ యువగళం పున: ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే..

అమరావతి : ఈ నెల 24వ తేదీ నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పున: ప్రారంభం కానుంది. విశాఖలో పాదయాత్రను ముగించే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో సెప్టెంబర్ 9వ తేదీన యువగళం పాదయాత్ర నిలిచిపోయింది. పాదయాత్ర నిలిచిపోయిన చోట నుంచి తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. చంద్రబాబు గతంలో వస్తున్న మీకోసం పాదయాత్రను విశాఖలో ముగించారు. అదే సెంటిమెంటుతో లోకేష్ కూడా విశాఖలోనే పాదయాత్ర ముగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాదయాత్రను కుదించే యోచనలో పార్టీ వర్గాలు ఉన్నట్టు సమాచారం.

Updated Date - 2023-11-20T07:53:18+05:30 IST