YCP Minister Rajini: పదేపదే ఆరోపణలు చేస్తోన్న లోకేష్‌కు మంత్రి రజిని సవాల్..

ABN , First Publish Date - 2023-07-02T18:49:55+05:30 IST

టీడీపీ యువ నేత నారా లోకేష్‌పై (Lokesh) చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ మంత్రి విడదల రజిని విమర్శలు (AP minister Vidada Rajini) గుప్పించారు.

YCP Minister Rajini: పదేపదే ఆరోపణలు చేస్తోన్న లోకేష్‌కు మంత్రి రజిని సవాల్..

గుంటూరు: టీడీపీ యువ నేత నారా లోకేష్‌పై (Lokesh) చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ మంత్రి విడదల రజిని విమర్శలు (AP minister Vidada Rajini) గుప్పించారు. లోకేష్ ఆరోగ్యశ్రీపై పదేపదే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య భద్రత కల్పించడంపై లోకేష్ తట్టుకోలేకపోతున్నాడని, ఆరోగ్య శ్రీపై బహిరంగ చర్చకు లోకేష్ సిద్ధమా అని సవాల్ మంత్రి రజిని సవాల్ చేశారు.

ఆరోగ్య శ్రీ టీడీపీ ప్రభుత్వం అనారోగ్య శ్రీగా మార్చిందని, ఆరోగ్య శ్రీని వెంటిలేటర్‌పై ఉంచారని ఆమె ఆరోపించారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకొచ్చిన వారి పేరైనా లోకేష్ చెప్పగలరా అని లోకేష్‌ను మంత్రి ప్రశ్నించారు. 3257 ప్రొసీజర్స్‌ను ఆరోగ్య శ్రీలో చేర్చిన ఘనత సీఎం జగన్‌ది అని ఆమె అన్నారు.

గత ప్రభుత్వంలో ఏడాదికి రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేదని, తమ హయాంలో ఈ ఒక్క ఏడాదిలోనే రూ. 3400 కోట్లు ఖర్చుపెట్టామని, నాలుగేళ్లలో రూ.10,100 కోట్లు ఖర్చుపెట్టామని మంత్రి విడుదల రజిని స్పష్టం చేశారు.

Updated Date - 2023-07-02T19:11:17+05:30 IST