Share News

AP News: రైలులో పురుడు పోసుకున్న మహిళ

ABN , First Publish Date - 2023-10-13T10:11:06+05:30 IST

జిల్లాలోని తాడేపల్లిగూడెం వద్ద ఓ మహిళ రైలులో పురుడు పోసుకుంది.

AP News: రైలులో పురుడు పోసుకున్న మహిళ

పశ్చిమగోదావరి: జిల్లాలోని తాడేపల్లిగూడెం వద్ద ఓ మహిళ రైలులో పురుడు పోసుకుంది. ఎర్నాకులం జంక్షన్ టు హటాయి వెళుతున్న దర్తి అబ్బా ఎక్స్‌ప్రెస్‌లో గర్భిణి మగబిడ్డకు జన్మనిచ్చింది. రష్మిత (23) అనే గర్భిణీ దర్తి అబ్బా ఎక్స్‌ప్రెస్‌లో కోయంబత్తూరు నుంచి బాలంగిరి వెళుతోంది. ఈ క్రమంలో రైలు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే మహిళకు నొప్పులు మొదలయ్యాయి. వెంటనే గుర్తించిన తోటి మహిళలు సహాయం చేయడంతో పండంటి మగ బిడ్డకు రష్మిత జన్మనిచ్చింది. భర్త సుశాంత్‌తో కలిసి రష్మిత పురిటి కోసం పుట్టింటికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. భర్త రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే మహిళను, పుట్టిన బిడ్డను 108కు వాహనంలో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Updated Date - 2023-10-13T10:11:06+05:30 IST