Share News

Lokesh YuvaGalam: యువగళం ముగింపు సభకు భారీగా ఏర్పాట్లు

ABN , Publish Date - Dec 15 , 2023 | 02:28 PM

Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు దశకు వచ్చేసింది. ఈఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర ఈనెల 20తో ముగియనుంది. ఈ నేపథ్యంలో యువగళం ముగింపు సభకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 20న విజయనగరం జిల్లాలో యువగళం ముగింపు సభ జరుగనుంది.

Lokesh YuvaGalam: యువగళం ముగింపు సభకు భారీగా ఏర్పాట్లు

అమరావతి: టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) ముగింపు దశకు వచ్చేసింది. ఈఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర ఈనెల 20తో ముగియనుంది. ఈ నేపథ్యంలో యువగళం ముగింపు సభకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 20న విజయనగరం జిల్లాలో యువగళం ముగింపు సభ జరుగనుంది. ఈ సభకు అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు తరలివచ్చే విధంగా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 19న వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక ట్రైన్లు విజయనగరం బయలుదేరనున్నాయి. చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపూర్, ఆదోని, నెల్లూరు, మాచర్ల నుంచి ఏడు ప్రత్యేక ట్రైన్లు విజయనగరానికి బయలుదేరనున్నాయి. ఒక్కో ట్రైన్లో 1300 మంది ప్రయాణించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఆర్టీసీ నుంచి అద్దెకు ప్రత్యేక బస్సులు కావాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోరారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Dec 15 , 2023 | 02:28 PM