Vijayawada: వంగలపూడి అనితపై అసభ్య పోస్టులు..

ABN , First Publish Date - 2023-07-17T16:52:32+05:30 IST

అమరావతి: తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ మంత్రి వంగలపూడి అనితపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెడుతున్నారంటూ తెలుగు మహిళలు నిరసనకు దిగారు. మహిళల్ని కాపాడాలంటూ ఇంద్రకీలాద్రి వద్ద విజయవాడ కనకదుర్గమ్మకు కొబ్బరికాయలు కొట్టారు.

Vijayawada: వంగలపూడి అనితపై అసభ్య పోస్టులు..

అమరావతి: తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anita)పై సామాజిక మాధ్యమాల్లో (Social Media) అసభ్య పోస్టులు పెడుతున్నారంటూ తెలుగు మహిళలు (Telugu Womens) నిరసన (Protest)కు దిగారు. మహిళల్ని కాపాడాలంటూ ఇంద్రకీలాద్రి వద్ద విజయవాడ కనకదుర్గమ్మకు (Kanakadurgamma) కొబ్బరికాయలు కొట్టారు. వైసీపీ నేతలు (YCP Leaders) మహిళల జోలుకు వస్తే ఉపేక్షించమని చెప్పులు చూపిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి, డీజీపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి (Jaganmohanreddy), భారతీ రెడ్డి (Bharati Reddy)ల పైశాచిక ఆనందం రోజు రోజుకూ పెరిగిపోతోందన్నారు. భారతీరెడ్డిపై ఎవరో ఏదో పోస్టు పెడితే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) ఇప్పుడెక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వైసీపీ పేటీఎం కుక్కలతో (YCP Paytm Dogs) పెట్టించే పోస్టుల పట్ల పోలీసులు ఎందుకు స్పందించరని నిలదీశారు. తనపై అసభ్య కథనాలు రాసిన వాడు ధైర్యముంటే తన ముందుకు రావాలని సవాల్ చేశారు.

తనపై అసభ్య పోస్టులు పెట్టిన వాడి ఇంట్లో మహిళలు లేరా? అని వంగలపూడి అనిత ప్రశ్నించారు. ముఖ్యమంత్రి భార్య గురించి పోస్టు వస్తేనే పోలీసులు స్పందిస్తారా?.. పవన్ కళ్యాణ్ కుటుంబంపైనా.. తమ కుటుంబాలపై ఎవరేం మాట్లాడినా పోలీసులకు పట్టదా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇకపై ఎవ్వరు తప్పుడు పోస్టులు పెట్టినా చెప్పులతోనే సమాధానం చెబుతామన్నారు. భారతీరెడ్డి అనుచరుడు, సజ్జల కొడుకు భార్గవ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతోందని, మహిళల్ని కించపరుస్తున్నారని వంగలపూడి అనిత ఆరోపించారు.

Updated Date - 2023-07-17T16:52:32+05:30 IST