Vangalapudi Anita: చంద్రబాబు భద్రతపై మాట్లాడటానికి మంత్రులు ఎవరు?

ABN , First Publish Date - 2023-09-15T16:25:38+05:30 IST

విశాఖ: టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై మంత్రుల వ్యాఖ్యలు, డీజీపీ మౌనం ప్రభుత్వ కుట్రలో భాగమనే అనుమానం కలుగుతోందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.

Vangalapudi Anita: చంద్రబాబు భద్రతపై మాట్లాడటానికి మంత్రులు ఎవరు?

విశాఖ: టీడీపీ అధినేత (TDP Chief) చంద్రబాబు (Chandrababu) భద్రతపై మంత్రుల వ్యాఖ్యలు, డీజీపీ (DGP) మౌనం ప్రభుత్వ కుట్రలో భాగమనే అనుమానం కలుగుతోందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anita) అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు సరైన భద్రతలేదని, ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని బాబు సతీమణి భువనేశ్వరి (Bhuvaneshwari) చెబుతున్నా డీజీపీ నోరెత్తడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు భద్రతపై మాట్లాడటానికి మంత్రులు ఎవరు?.. వాళ్లకేంతెలుసని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.

ప్రజాగ్రహం పెల్లుబుకి, 70 లక్షల మంది టీడీపీ కార్యకర్తలు (TDP Activists) రోడ్లపైకి వస్తే ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేయగలదని వంగలపూడి అనిత ప్రశ్నించారు. వైసీపీ ప్లెక్సీలకు పోలీసులు కాపలా ఉన్నప్పుడే ఎంత దిగజారిపోయారో అర్థమైందన్నారు. 16 నెలలు జైల్లో ఉండివచ్చి, బెయిల్‌పై రాష్ట్రాన్ని పాలిస్తూ, 38 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ రెడ్డి (Jagan Reddy) అమూల్ బేబీనా?... ఏ తప్పూ చేయని చంద్రబాబు ఆర్థిక ఉగ్రవాదా?.. భారతిరెడ్డి (Bharti Reddy)కి ఢిల్లీ కోర్టు (Delhi Court) నోటీసులు (Notices) పంపితే మంత్రి రోజా (Minister Roja) సంబరాలు చేయదేం? అని ప్రశ్నించారు. పోలీసులు లేకుండా బయటకు వస్తే మహిళా మంత్రికి టీడీపీ చేపట్టింది బందో... బొందో బాగా తెలిసేదని అనిత అన్నారు.

Updated Date - 2023-09-15T16:25:38+05:30 IST