Share News

Pawan Kalyan: జనసేన నేతల అరెస్టులపై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-12-11T14:03:15+05:30 IST

అమరావతి: విశాఖలో జనసేన నేతల అరెస్టులపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడిన జనసేన నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పాటు మిగిలిన నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Pawan Kalyan: జనసేన నేతల అరెస్టులపై పవన్ కళ్యాణ్  ఏమన్నారంటే..

అమరావతి: విశాఖలో జనసేన (Janasena) నేతల అరెస్టులపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడిన జనసేన నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar)తో పాటు మిగిలిన నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, పోలీసుల తీరును ఖండిస్తున్నామన్నారు. జనసేన నేతలను విడుదల చెయ్యకపోతే తానే విశాఖ వచ్చి ప్రజా సమస్యలపై పోరాడతానని స్పష్టం చేశారు.

విశాఖ టైకూన్ జంక్షన్ (Tycoon Junction) మూసివేతపై నిరసనకు జనసేన నేతలు పిలుపివ్వడంతో అటువైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. నోవాటెల్ హోటల్ (Novatel Hotel) వద్ద నాదెండ్ల మనోహర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. టైకూన్ జంక్షన్ వీఐపీ రోడ్డు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సిరిపురంలో పీక్స్ అనే ప్రాజెక్టును ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (MP MVV Satyanarayana) నిర్మాణం చేపడుతున్నారు. దీనికి సంబంధించిన రోడ్డు డివైడర్‌ను మూసివేశారు. వాహనరాకపోకలు నిలిపివేశారు. దీన్ని జనసేన నేతలు ఖండించారు.

ఈ సందర్బంగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా టైకూన్ జంక్షన్లో వాహనదారులు నానా ఆవస్థలు పడుతున్నారని, ఎంపీ తనకు అనుకూలంగా జంక్షన్ మధ్యలో బార్కెట్లు వేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఇది వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకోవడం కాదా? అని నిలదీశారు. ఎంపీ సత్యనారాయణ లేఖ రాసినా పోలీసులు ఎందుకు బార్కెట్లు తొలగించడం లేదన్నారు. ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనని, ట్రాఫిక్ ఇబ్బందులు ప్రజలు స్వయంగా అనుభవిస్తున్నారన్నారు.

ఈ విషయమై పలు మార్లు కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చామని.. అయినా పట్టనట్లు వున్నారని నాదేండ్ల మనోహర్ అన్నారు. పోలీసులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలుపుదామని పిలిపిస్తే తమను హోటల్ నుంచి బయటకు వెళ్ళనివ్వకపోవడం ఏంటన్నారు. ఈరోజు కౌన్సిల్ మీటింగ్‌కు తమ కార్పొరేటర్లు హాజరుకావాల్సి వుందని, వారిని కూడా అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. మరో మూడు నెలలే ఉందని, ఈ ప్రభుత్వానికి పరాభవం తప్పదని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.

Updated Date - 2023-12-11T14:05:18+05:30 IST