Share News

Gajendra Singh Shekhawat: పొలవరం అంచనా వ్యయాన్ని జగన్ ప్రభుత్వం పెంచింది

ABN , First Publish Date - 2023-11-02T20:25:01+05:30 IST

పొలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని జగన్ ప్రభుత్వం పెంచిందని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర షేకావత్ ( Gajendra Shekawat ) అన్నారు.

Gajendra Singh Shekhawat: పొలవరం అంచనా వ్యయాన్ని జగన్ ప్రభుత్వం  పెంచింది

విశాఖపట్నం: పొలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని జగన్ ప్రభుత్వం పెంచిందని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర షేకావత్ ( Gajendra Singh Shekhawat ) అన్నారు. గురువారం నాడు విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సవరించిన అంచనాలను గత నెల 19వ తేదీన కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పగించింది. వాటి మీద కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికి పోలవరం కావలిసిన నిధులు ఉన్నాయి. పునరావాస అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక వేస్తే, పర్యవేక్షణ కేంద్రం చేస్తుంది’’ అని గజేంద్ర షేకావత్ తెలిపారు. సమావేశం అనతరం కేంద్ర మంత్రి గజేంద్ర షేకావత్‌ను రాజస్థాన్ మండలి సమితి సభ్యులు సత్కరించారు.

Updated Date - 2023-11-02T20:25:16+05:30 IST