Share News

YuvaGalam: లోకేష్‌ను కలిసిన ఎస్‌ఈజెడ్ నిర్వాసిత ప్రజలు

ABN , Publish Date - Dec 15 , 2023 | 02:00 PM

Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా లోకేష్‌ను ఎస్ఈజెడ్ నిర్వాసిత ప్రజలు కలిశారు.

YuvaGalam: లోకేష్‌ను కలిసిన ఎస్‌ఈజెడ్ నిర్వాసిత ప్రజలు

అనకాపల్లి: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా లోకేష్‌ను ఎస్ఈజెడ్ నిర్వాసిత ప్రజలు కలిశారు. పూడి, చిప్పాడ గ్రామాలకు చెందిన ఎస్‌ఈజెడ్ నిర్వాసితులు తాము ఎదుర్కుంటున్న సమస్యలను యువనేతకు చెప్పారు.

దీనిపై లోకేష్ స్పందిస్తూ.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భూనిర్వాసితుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసం భూములిచ్చిన నిర్వాసితులకు చట్టప్రకారం వసతులు, పరిహారం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఎస్‌ఈజెడ్ నిర్వాసితులకు కేటాయించిన భూమిని అభివృద్ధి చేసి, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

Updated Date - Dec 15 , 2023 | 02:00 PM