TDP Leader: రోజాను ఎవరూ మహిళగా భావించడం లేదు.. కూన రవికుమార్ ఎద్దేవా...

ABN , First Publish Date - 2023-10-04T12:50:35+05:30 IST

మంత్రి రోజాపై టీడీపీ నేత కూన రవికుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రోజా మాట్లాడుతున్నవి చాగంటి గారి ప్రవచనాలా అంటూ ఎద్దేవా చేశారు.

TDP Leader: రోజాను ఎవరూ మహిళగా భావించడం లేదు.. కూన రవికుమార్ ఎద్దేవా...

శ్రీకాకుళం: మంత్రి రోజాపై (Minister Roja) టీడీపీ నేత కూన రవికుమార్ (TDP Leader Kuna Ravikumar) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రోజా మాట్లాడుతున్నవి చాగంటి గారి ప్రవచనాలా అంటూ ఎద్దేవా చేశారు. రోజాని చూసి మహిళ జాతి సిగ్గు పడుతోందన్నారు. ఏపీ మహిళలు రోజాను చూసి మహిళగా ఎవరు భావించడంలేదని వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో అసెంబ్లీలో రోజా చేసిన పనులు దగ్గరుండి చూశామన్నారు. వైసీపీ నేతలు (YCP Leaders) ఎంత దారుణంగా మాట్లాడుతున్నా వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


టీడీపీ నేత ఇంకా మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు టీడీపీ అధినేత చంద్రబాబుకు (TDP Chief Chandrababu Naidu) మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం తొక్కుతోందని మండిపడ్డారు. టీడీపీ నేతలను నిర్బంధిస్తున్నారన్నారు. ప్రజలు తిరుగుబాటు మొదలు పెడితే.. జగన్ (CM Jagan) కాదు కదా జగన్ తాత కూడా అపలేడని వ్యాఖ్యలు చేశారు. పోలీసులు బాధ్యతలు మరిచి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాల రాస్తున్నారన్నారు. ప్రజలకు స్వేచ్చగా జీవించే హక్కు, ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యం ఇచ్చిందని తెలిపారు. ప్రజా పోరాటం ఉధృతమైతే.. పోలీసులు కూడా నిలబడలేరన్నారు. పౌర హక్కుల విషయంలో పాకిస్థాన్‌కు.. ఆంధ్రాకు తేడా ఏముందని ప్రశ్నించారు. పోలీసులు టీడీపీపై దృష్టి పెడుతున్నారు గానీ లా అండ్ ఆర్డర్‌ను గాలికి వదిలేశారని కూన రవికుమార్ విమర్శలు గుప్పించారు.

Updated Date - 2023-10-04T12:50:35+05:30 IST