Yogi Re-Release: ప్రభాస్ ఫ్యాన్స్ అత్యుత్సాహం.. రెండు థియేటర్లకు భారీ నష్టం

ABN , First Publish Date - 2023-08-18T16:46:12+05:30 IST

తమ అభిమాన హీరో పాత సినిమా రీరిలీజ్ అవుతుండడంతో అభిమానులు థియేటర్లకు వెళ్లి నానా హంగామా చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ అభిమానులు ఏపీలోని రెండు చోట్ల బీభత్సం సృష్టించారు. నంద్యాలలోని రాజ్ థియేటర్‌తో పాటు కాకినాడలోని శ్రీప్రియ థియేటర్‌లో అభిమానులు స్క్రీన్‌లను చించివేశారు. సినిమాలోని పాటలకు డ్యాన్స్ చేస్తూ అత్యుత్సాహంతో అభిమానులు స్క్రీన్ మీద పడటంతో రెండు చోట్ల భారీగా డ్యామేజ్ జరిగింది.

Yogi Re-Release: ప్రభాస్ ఫ్యాన్స్ అత్యుత్సాహం.. రెండు థియేటర్లకు భారీ నష్టం

ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో రీ-రిలీజ్ సినిమాల హవా నడుస్తోంది. కొత్త సినిమాలు విడుదలవుతున్నా పట్టించుకోని ప్రేక్షకులు పాత సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే మాత్రం థియేటర్‌కు క్యూ కడుతున్నారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన యోగి సినిమాను ఈరోజు రీ-రిలీజ్ చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఈ మూవీని చూసేందుకు బారులు తీరారు. అయితే సినిమాను చూస్తూ ఎంజాయ్ చేయడంతో పాటు ఫ్యాన్స్ అలజడి సృష్టించారు. ఏపీలో రెండు చోట్ల థియేటర్లను ధ్వంసం చేశారు. నంద్యాలలోని రాజ్ థియేటర్‌తో పాటు కాకినాడలోని శ్రీప్రియ థియేటర్‌లో అభిమానులు స్క్రీన్‌లను చించివేశారు. సినిమాలోని పాటలకు డ్యాన్స్ చేస్తూ అత్యుత్సాహంతో అభిమానులు స్క్రీన్ మీద పడటంతో రెండు చోట్ల భారీగా డ్యామేజ్ జరిగింది.

nandyal.jpg

కాకినాడ శ్రీప్రియ థియేటర్‌ను ఇటీవలే ఆధునీకరణ చేశారు. ఇప్పుడు ప్రభాస్ అభిమానుల పని వల్ల ఇకపై థియేటర్‌లో రీ రిలీజ్ సినిమాలను ప్రదర్శించబోమని యాజమాన్యం స్పష్టం చేసింది. అటు నంద్యాల రాజ్ థియేటర్ యాజమాన్యం కూడా తాజా ఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. అభిమానులు సినిమా చూసేందుకు వచ్చి ఇలా పిచ్చి పనులు చేయడం సమంజసం కాదని మండిపడింది. కాగా ప్రభాస్ నటించిన యోగి సినిమా గతంలో విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఇదే చిత్రాన్ని ఇప్పుడు మళ్లీ విడుదల చేయడంతో ప్రభాస్ అభిమానులు తమ హీరోను చూసేందుకు టిక్కెట్లు బుక్ చేసుకుని హంగామా చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: 2023 Muhurtham Dates: 20 రోజులు తప్పిస్తే అన్నీ మంచి ముహూర్తాలే.. సెప్టెంబర్‌లో కేవలం..

గతంలోనూ పలువురి హీరోల సినిమాలు రీ రిలీజ్ సందర్భంగా థియేటర్లను ధ్వంసం చేయడం, థియేటర్‌లో మంటలు వెలిగించడం, సీట్లతో పాటు స్క్రీన్‌లను చించివేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ బస్టర్‌ హిట్ సింహాద్రి మూవీ రీ రిలీజ్ సందర్భంగా విజయవాడ అప్సర థియేటర్‌లో నిప్పు పెట్టడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేయడం పెద్ద ప్రమాదం తప్పింది.

Updated Date - 2023-08-18T16:54:10+05:30 IST