Satyagraha Deeksha: ఏపీ ప్రభుత్వంపై ఎన్టీఆర్ మనమడు ఆగ్రహం

ABN , First Publish Date - 2023-10-02T11:41:08+05:30 IST

ఏపీ ప్రభుత్వంపై ఎన్టీఆర్ మనమడు గారపాటి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసగా ఎన్టీఆర్‌భవన్‌లో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Satyagraha Deeksha: ఏపీ ప్రభుత్వంపై ఎన్టీఆర్ మనమడు ఆగ్రహం

హైదరాబాద్/అమరావతి: ఏపీ ప్రభుత్వంపై (AP Government) ఎన్టీఆర్ మనమడు గారపాటి శ్రీనివాస్ (NTR Garndson Garapati Srinivas) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌కు (TDP Chief Chandrababu Arrest) నిరసగా ఎన్టీఆర్‌భవన్‌లో (NTR Bhavan) చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర (Nandamuri Balakrishna Wife Vasundhara), ఎన్టీఆర్ కుటుంబసభ్యులు (NTR Family) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మనమడు గారపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు కించపరిచినప్పుడు మహిళా కమిషన్ ఎటు పోయిందని ప్రశ్నించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలు గాజులు తొడుక్కుని కూర్చున్నారని విమర్శించారు. భువనేశ్వరి, బ్రహ్మణి, లోకే‌శ్‌లకు ఎన్టీఆర్ ఫ్యామిలీ అండగా ఉంటోందని తెలిపారు. ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తే రేపటి తరాలకు ఏం నేర్పిస్తారని నిలదీశారు. చంద్రబాబును జైల్లో పెడితే తెలుగు వారు ఊరుకోరన్నారు. చంద్రబాబు బయటకు వస్తారని రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తారని గారపాటి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-02T11:43:49+05:30 IST