Somireddy: పవన్ ప్రకటనతో జగన్‌కు నిద్ర పట్టట్లేదు

ABN , First Publish Date - 2023-05-17T15:12:15+05:30 IST

చంద్రబాబు-పవన్‌కళ్యాణ్‌లను తిట్టేందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజాధనంతో మీటింగ్‌లు పెడుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

Somireddy: పవన్ ప్రకటనతో జగన్‌కు నిద్ర పట్టట్లేదు
Somireddy

అమరావతి: చంద్రబాబు-పవన్‌కళ్యాణ్‌లను తిట్టేందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి (CM JAGAN) ప్రజాధనంతో మీటింగ్‌లు పెడుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు అంతా ఒక్కటవుతున్నామన్న పవన్ వ్యాఖ్యలను ప్రజలు స్వాగతించడంతో ముఖ్యమంత్రికి నిద్ర పట్టట్లేదు. రాజకీయంలో సర్వసాధారణమైన పార్టీల మధ్య పొత్తు అంశంపై జగన్మోహన్ రెడ్డిలో అంత కలవరం దేనికి?, అవినీతిపరుడు, అరాచకవాది చేతుల్లో నుంచీ రాష్ట్రాన్ని కాపాడాలన్న ప్రజల అభిమతం మేరకే పొత్తులు ఉంటాయి. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా 1977లో దేశంలో జనతా పార్టీ నేతృత్వంలో జనసoగ్, వామపక్ష పార్టీలన్నీ ఒక్కటి కాలేదా? 1985లో రాష్ట్రంలో బీజేపీ (BJP), వామపక్షాలు.. టీడీపీ (TDP)తో కలిసి కాంగ్రెస్‌ను ఓడించలేదా?.’’ అని సోమిరెడ్డి గుర్తుచేశారు.

‘‘న్యాయస్థానాలతో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆటలాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీబీఐను కూడా ప్రజలు శంకించే పరిస్థితి వస్తోంది. వివేకా హత్యకేసులో నిందితులుగా ఉన్న తండ్రీకొడుకుల్లో భాస్కర్ రెడ్డి జైల్లో ఉండటమేంటి?, అవినాష్ రెడ్డి బయట ఉండటమేంటి?, సీబీఐ.. అవినాష్ రెడ్డిని పిలిచినప్పుడల్లా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఎందుకు ఖరారవుతోంది?.’’ అర్థం కావట్లేదని సోమిరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-05-17T15:12:15+05:30 IST