AP News: ‘అకాల వర్షాలతోనూ రాజకీయాలా?’

ABN , First Publish Date - 2023-05-06T16:32:51+05:30 IST

రైతులు చంద్రబాబు (Chandrababu) మాటలు ఎప్పటికీ నమ్మరని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి (Kakani Govardhan Reddy) అన్నారు.

AP News: ‘అకాల వర్షాలతోనూ రాజకీయాలా?’

నెల్లూరు: రైతులు చంద్రబాబు (Chandrababu) మాటలు ఎప్పటికీ నమ్మరని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి (Kakani Govardhan Reddy) అన్నారు. రైతులకి ఈ ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు. చంద్రబాబు ఆకలా వర్షాలతోనూ రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. ఒక బస్తాకు రైతులు రూ.650లు నష్టపోతున్నారని చెప్పే మాటలన్నీ అబద్ధాలేనని, చంద్రబాబు సభలోనే ఒక రైతు మాట్లాడుతూ ప్రభుత్వం తమకి మద్దతు ధర ఇస్తుందని చెప్పాడని పేర్కొన్నారు. 2022-23 రబీ సీజన్‌కు సంబంధించి పంట భీమా చేయలేదనే మాటలు అవాస్తవమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు చంద్రబాబు చూసుకోవాలని సూచించారు. వర్షం వల్ల తడిచిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనెలా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.

Updated Date - 2023-05-06T16:32:51+05:30 IST