Share News

Bhuvaneshwari: ‘ఈ సంతోషం అందరిది’... చంద్రబాబుకు బెయిల్ మంజూరుపై భువనేశ్వరి

ABN , First Publish Date - 2023-10-31T13:30:54+05:30 IST

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు అవడంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు బెయిల్ రావడంపై తానే కాదు ప్రజలందరూ సంతోషిస్తున్నారన్నారు.

Bhuvaneshwari: ‘ఈ సంతోషం అందరిది’... చంద్రబాబుకు బెయిల్ మంజూరుపై భువనేశ్వరి

విజయనగరం: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు (TDP Chief Chandrababu Naidu) బెయిల్ మంజూరు అవడంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు బెయిల్ రావడంపై తానే కాదు ప్రజలందరూ సంతోషిస్తున్నారన్నారు. నేడు జనం గెలిచారని.. ఈ సంతోషం అందరిది అని అన్నారు. చంద్రబాబు క్షేమంగా జైలు నుంచి రావాలని ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే రైలు దుర్ఘటన బాధితులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు భువనేశ్వరి తెలిపారు.


కాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజమండ్రికి వచ్చిన భువనేశ్వరి గత 53 రోజులుగా అక్కడే ఉన్నారు. చంద్రబాబు విడుదల కోరుతూ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే చంద్రబాబు పట్ల ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. పలు మార్లు రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. భువనేశ్వరికి పలువురు నేతలు మద్దతు తెలుపుతూ పరామర్శించారు.

Updated Date - 2023-10-31T13:30:54+05:30 IST