Share News

Ramakrishna: అంగన్వాడీలని మోసం చేసిన జగన్‌రెడ్డి

ABN , Publish Date - Dec 18 , 2023 | 10:39 PM

తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తానని అంగన్వాడీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN ) హామీ ఇచ్చి మరి ఎందుకు ఇవ్వడం లేదని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ( Ramakrishna ) తెలిపారు.

Ramakrishna: అంగన్వాడీలని మోసం చేసిన జగన్‌రెడ్డి

కర్నూలు : తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తానని అంగన్వాడీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN ) హామీ ఇచ్చి మరి ఎందుకు ఇవ్వడం లేదని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ( Ramakrishna ) తెలిపారు. సోమవారం నాడు సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ...‘‘అంగన్వాడీలని జగన్‌రెడ్డి మోసం చేశారు. సీఎం జగన్ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా పోలీసులు, వలంటీర్లు, అంగన్వాడీలకు తగాదాలు పెడుతున్నారు. అధికారులతో జగన్ అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగల గొట్టిస్తున్నారు మూడు నెలలు ఉంటే వైసీపీ తాళాలను అంగన్వాడీలు పగలగొడతారు. అంగన్వాడీల సమ్మెకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. అవసరమైతే మా కార్యకర్తలు నేరుగా రంగంలోకి దిగుతారు’’ అని రామకృష్ణ హెచ్చరించారు.

Updated Date - Dec 18 , 2023 | 10:39 PM