AP News: ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయుల ధర్నా.. రోజా.. బైరెడ్డి క్షమాపణకు డిమాండ్

ABN , First Publish Date - 2023-07-18T16:38:46+05:30 IST

నందికొట్కూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల‌్‌లో ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయులు ఆందోళన చేపట్టారు. మంత్రి రోజా పర్యటనలో దళిత ఎమ్మెల్యే ఆర్థర్ అవమానం జరిగిందని నిరసన చేపట్టారు.

AP News: ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయుల ధర్నా.. రోజా.. బైరెడ్డి క్షమాపణకు డిమాండ్

నంద్యాల: నందికొట్కూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల‌్‌లో ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయులు ఆందోళన చేపట్టారు. మంత్రి రోజా పర్యటనలో దళిత ఎమ్మెల్యే ఆర్థర్ అవమానం జరిగిందని నిరసన చేపట్టారు. మంత్రి రోజా (RK. Roja), శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, అతని అనుచరులపై పార్టీ చర్యలు తీసుకుని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే ఆర్థర్‌కు మంత్రి రోజా, సిద్ధార్థ రెడ్డి క్షమాపణ చెప్పాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే మద్దతుదారులు, దళిత సంఘాల నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. రెండు గంటల పాటు కర్నూల్-గుంటూరు రహదారిపై రాకపోకలు స్తంభించాయి.

Updated Date - 2023-07-18T16:38:46+05:30 IST