AP News: కోడుమూరులో సైబర్ నేరగాళ్ల మోసం.. ఖాతాల నుంచి డబ్బు మాయం

ABN , First Publish Date - 2023-09-29T16:08:30+05:30 IST

కోడుమూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వ్యక్తుల ఖాతా నుంచి డబ్బులు మాయం చేశారు. రిజిస్టర్ కొరకు ఆధార్ ఈకేవైసీ చేయగానే అకౌంట్ నుంచి డబ్బులు మిస్ అయ్యాయి. హుసేన్

AP News: కోడుమూరులో సైబర్ నేరగాళ్ల మోసం.. ఖాతాల నుంచి డబ్బు మాయం

కర్నూలు: కోడుమూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వ్యక్తుల ఖాతా నుంచి డబ్బులు మాయం చేశారు. రిజిస్టర్ కొరకు ఆధార్ ఈకేవైసీ చేయగానే అకౌంట్ నుంచి డబ్బులు మిస్ అయ్యాయి. హుసేన్ అనే వ్యక్తి అకౌంట్ నుంచి మూడు రోజుల్లో రోజుకు 10 వేలు చొప్పున కేటుగాళ్లు డ్రా చేశారు. వినోద్ అనే వ్యక్తి అకౌంట్ నుంచి విడతల వారిగా సైబర్ ఆగంతకులు 17 వేలు తీసుకున్నారు. రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరి అకౌంట్ నుంచి 10 వేలు డ్రా చేశారు. మహారాష్ట్ర ధానె లోని సీఎస్‌పీ ఎస్‌బీఐ 10521 రూరల్ అకౌంట్ నందు జమ అయినట్టు అనుమానిస్తున్నారు.

Updated Date - 2023-09-29T16:09:36+05:30 IST