Baireddy Siddharth Reddy: వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-08-31T19:57:30+05:30 IST

వైసీపీ నేతలపై శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి (Baireddy Siddharth Reddy)సంచలన వ్యాఖ్యలు చేశారు.

Baireddy Siddharth Reddy:  వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు

నంద్యాల వైసీపీ నేతలపై శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి (Baireddy Siddharth Reddy)సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు నందికొట్కూరు వేదికగా స్థానిక ఎమ్మెల్యే తొగురు ఆర్ధర్‌(MLA Thoguru Arthar) మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిద్దార్థరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘‘జగన్మోహన్‌రెడ్డి పుణ్యన ఎమ్మెల్యే అయిన కొందరు జగన్ వల్లే ఎమ్మెల్యే అయినామని చెప్పుకోవడానికి నమోషి పడుతున్నారు. జగన్ బొమ్మ లేకుంటే నెత్తి మీద పావుల పెట్టిన చెల్లరు. నందికొట్కూరులో ప్రోటోకాల్ సమస్య ఉంటుదని ఎమ్మెల్యేను వ్యంగ్యంగా పరోక్షంగా విమర్శించారు.175 ఎమ్మెల్యే స్థానాలకు గానూ 100 మంది ఎమ్మెల్యేల గెలుపు కోసం తిరుగుతాను.పక్క నియోజకవర్గంలో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లు పెట్టిన వారిని పట్టుకుంటున్న పోలీసులు మా వాళ్ల ఇంట్లో నాటుబాంబులు పెట్టిన పట్టించుకోవడం లేదు. నేను నా మనుషులను రెచ్చగొడితే నందికొట్కూరు పొలిమేరలో కూడా అడుగుపెట్టలేరు’’ అని సిద్దార్థరెడ్డి స్థానిక ఎమ్మెల్యేను హెచ్చరించారు.

Updated Date - 2023-08-31T19:57:30+05:30 IST