K. Rammohana Rao: కోర్టు తీర్పుతోనైనా జగన్రెడ్డి కళ్లు తెరవాలి
ABN , First Publish Date - 2023-11-20T23:46:11+05:30 IST
కోర్టు తీర్పుతోనైనా జగన్ రెడ్డి కళ్లు తెరవాలని మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకులు కంభంపాటి రామ్మోహనరావు ( Kambhampati Rammohana Rao ) అన్నారు.

అమరావతి : కోర్టు తీర్పుతోనైనా జగన్ రెడ్డి కళ్లు తెరవాలని మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకులు కంభంపాటి రామ్మోహనరావు ( Kambhampati Rammohana Rao ) అన్నారు. సోమవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి రెగ్యులర్ బెయిల్ మంజూరు జగన్రెడ్డికి చెంపపెట్టు. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా లేవని కోర్టు స్పష్టం చేసింది. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు మాని ఉన్న 5 నెలలైనా ప్రజలకు ఏం చేయాలో జగన్రెడ్డి ఆలోచించాలి. వచ్చే ఎన్నికల్లో కనీసం ఓ 20 సీట్లలో డిపాజిట్లు అయినా దక్కుతాయి, లేదంటే రాష్ట్రంలో వైసీపీ భూస్ధాపితం కావటం ఖాయం’’ అని కంభంపాటి రామ్మోహనరావు తెలిపారు.