Krishna Dist.: అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్

ABN , First Publish Date - 2023-06-30T14:12:04+05:30 IST

కృష్ణాజిల్లా: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నేతగా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రధాన కార్యదర్శి పరుచూరి సుభాష్ చంద్రబోస్‌తో పాటు ఆయన అనుచరులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

Krishna Dist.: అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్

కృష్ణాజిల్లా: ఏపీ (AP)లో ఎన్నికలు (Elections) సమీపిస్తున్న తరుణంలో అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీ (YCP)కి గట్టి షాక్ (Shock) తగిలింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నేతగా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రధాన కార్యదర్శి పరుచూరి సుభాష్ చంద్రబోస్‌ (Paruchuri Subhash Chandra Bose)తో పాటు ఆయన అనుచరులు చంద్రబాబు (Chandrababu) సమక్షంలో టీడీపీ (TDP)లో చేరారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ టీడీపీ ఇన్ఛార్జ్ మండలి బుద్ధ ప్రసాద్ (Mandali Buddha Prasad) పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ముందు బకాసురుడు కూడా తక్కువేనన్నారు. ప్రపంచంలో ఉండే వింత జంతువుల కంటే వింత జంతువు జగన్మోహన్ రెడ్డని, మనం మారకపోతే జీవితాలు మారవనే వాస్తవం గ్రహించిన వైసీపీ నేతలు తెలుగుదేశం వైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడితే రాష్ట్రం గెలిచినట్లని చెబుతున్నానన్నారు.

రాష్ట్రం గెలుపు కోసం ప్రతీ ఒక్కరూ మారి గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరూ కష్టపడాలని చంద్రబాబు సూచించారు. గొడవలు అంటే తెలియని ప్రశాంత నగరంగా ఉండే విశాఖలో ఇప్పుడు ఎవరైనా అడుగుపెట్టాలంటే భయపడుతున్నారన్నారు. ప్రారంభానికి ముందే పొలవరాన్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టారని, ఐదేళ్ల కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు మాదిరి చేశారని చంద్రబాబు మండిపడ్డారు.

Updated Date - 2023-06-30T14:12:04+05:30 IST