TDP: అంత సమయం చంద్రబాబు ప్రజల మధ్య గడపడం..: కొల్లు రవీంద్ర

ABN , First Publish Date - 2023-04-15T16:03:28+05:30 IST

ఉమ్మడి కృష్ణా జిల్లాలలో రెండు పార్లమెంట్లలో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం అయ్యిందని టీడీపీ (TDP) నేత కొల్లు రవీంద్ర (Kollu Ravindra) అన్నారు.

TDP:  అంత సమయం చంద్రబాబు ప్రజల మధ్య గడపడం..: కొల్లు రవీంద్ర

విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలలో రెండు పార్లమెంట్లలో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం అయ్యిందని టీడీపీ (TDP) నేత కొల్లు రవీంద్ర (Kollu Ravindra) అన్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి ఒంటి గంట వరకు చంద్రబాబు (Chandrababu) ప్రజల మధ్య గడపడాన్ని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఆరు గంటలు ఆలస్యమైన ప్రజలు రోడ్లపై, ఆడబిడ్డలు చంటిబిడ్డలతో చంద్రబాబు కోసం ఎదురు చూశారని తెలిపారు. చంద్రబాబు గురించి మాట్లాడటానికి పేర్ని నాని (Perni nani), కొడాలి నాని (Kodali nani)కి ఏమి అర్హత ఉందన్నారు. దుర్మార్గుడైన ముఖ్యమంత్రి చేస్తున్న అరాచకాల గురించి మాట్లాడితే మీరు సమర్థిస్తారా?, ముస్లిం సోదరులు చాలా పవిత్రంగా భావిస్తారు, ఔరంగజేబుపై పేర్ని నాని వ్యాఖ్యలతో ముస్లింల మనోభావాలు దెబ్బతినేవిధంగా మాట్లాడతారా? అని ఆయన ప్రశ్నించారు. రాజుగా/చక్రవర్తిగా ఉన్న టోపీలు అమ్ముకుని వాటిపై వచ్చిన ఆదాయంపై జీవించారు తప్ప మీలాగా అవినీతి చేయలేదన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సామ్య్రాజ్యాన్ని స్థాపించారని పేర్కొన్నారు. మీ అవినీతి భాగోతాలు వివరాలు మొత్తం ఉన్నాయన్నారు. ఈ నాలుగేళ్లలో వందల కోట్లు దోచుకున్నారని, ఇవన్నీ లెక్కలు ఎక్కడకు పోవు —మొత్తం తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బయటపెట్టించి కక్కిస్తామన్నారు.

Updated Date - 2023-04-15T16:04:12+05:30 IST