AP News: మరోసారి రెచ్చిపోయిన జోగి రమేష్ అనుచరులు

ABN , First Publish Date - 2023-04-22T22:12:04+05:30 IST

జిల్లాలో జిగూడూరులో మరోసారి మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) అనుచరులు రెచ్చిపోయారు.

AP News: మరోసారి రెచ్చిపోయిన జోగి రమేష్ అనుచరులు

కృష్ణా: జిల్లాలో జిగూడూరులో మరోసారి మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) అనుచరులు రెచ్చిపోయారు. మట్టి మాఫియాపై ఫిర్యాదు చేశారనే అక్కసుతో యువకులపై‌ దాడికి పాల్పడ్డారు. రాజకీయ కారణాలతో తమ పార్టీ కార్యకర్తలును కొట్టారని జనసేన (Janasena) నేత బండ్రెడ్డి రాము ఆందోళనకు దిగారు. గూడూరు మండలం ఆకుమర్రు లాకుల వద్ద అక్రమ మట్టి రవాణా జరుగుతున్నట్లు... సమాచారం తెలుసుకుని పట్టించేందుకు జనసేన కార్యకర్తలు అక్కడకి‌ వెళ్లారు. వారిపై మంత్రి జోగి రమేష్ అనుచరులు దాడి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. రామకృష్ణ అనే జనసైనికుడిని స్థంభానికి కట్టేసి చితక‌బాదారని వారు వాపోతున్నారు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణను బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం బయటకి రాకుండా రాజీ చేసేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఆస్పత్రి వద్దకు జనసేన నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. దాడికి పాల్పడ్డ జోగి రమేష్ అనుచరులును అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

జిల్లాలో మంత్రి జోగి రమేష్ అరాచకాలు పెరిగి పోయాయని జనసేన నేత బండ్రెడ్డి రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ధనం దోచేస్తున్న అధికారులు పట్టించుకోరని ఆరోపించారు. తమ లాంటోళ్లు అడిగితే...‌ బరి తెగించి చంపేస్తారా? అంంటూ మండిపడ్డారు. ఇంత జరిగినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. నిందితులను‌ వదిలేసి బాధితులపై కేసులు పెట్టడం ధర్మం కాదన్నారు. మంత్రి జోగి రమేష్‌కి తప్పకుండా వచ్చే ఎన్నికలలో బుద్ది చెబుతామన్నారు.

Updated Date - 2023-04-22T22:12:06+05:30 IST