Ambati Rambabu: ఏపీ మంత్రివర్గంలో మార్పులపై మంత్రి అంబటి క్లారిటీ...

ABN , First Publish Date - 2023-04-03T11:09:57+05:30 IST

ఏపీ మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు జరుగుతాయంటూ వస్తున్న వార్తలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.

Ambati Rambabu: ఏపీ మంత్రివర్గంలో మార్పులపై మంత్రి అంబటి క్లారిటీ...

అమరావతి: ఏపీ మంత్రి వర్గం (AP Cabinetలో మార్పులు చేర్పులు జరుగుతాయంటూ వస్తున్న వార్తలపై మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu)స్పందించారు. ఈరోజు గడపగడపు మన ప్రభుత్వంపై సీఎం జగన్ సమీక్ష చేయనున్న నేపథ్యంలో మంత్రి అంబటి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధినేత జగన్ (AP CM YS Jaganmohan Reddy)గడపగడపకు మన ప్రభుత్వంపై సమీక్షిస్తారని.... ఎవ్వరిదైనా గ్రాఫ్ బాగోపోతే ముందే వారికి తప్పుకోవాలని చెపుతారన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే వారికి ప్రాధాన్యం ఇస్తామని సీఎం జగన్ (CM Jagan)ముఖం మీదే చెపుతారని తెలిపారు. ఈరోజు అయితే మీకు సీటు లేదని ఎవ్వరికి చెపుతారు అనుకోవడం లేదని అన్నారు. మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు అనే సమాచారం తన వద్ద లేదని స్పష్టం చేశారు. అలాంటి మార్పులు ఇప్పుడు ఉంటాయని అనుకోవడం లేదన్నారు. ఈనెల 7 నుంచి జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని... దీనిపైన గడప గడపలో చర్చ ఉంటుందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.

కాగా.. గడపగడపకు మన ప్రభుత్వం ఐదో విడదల వర్క్ షాప్‌కు సర్వం సిద్ధమైంది. జగన్ననే మా భవిష్యత్తు స్టిక్కర్ల పంపిణీ కార్యక్రమమే ప్రధాన అజెండాగా తాడేపల్లి క్యాంపు ఆఫీసులో సమావేశం జరుగనుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపిలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ప్రాంతీయ సమన్వయకర్తలు.. సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటున్నారు.

Updated Date - 2023-04-03T11:10:17+05:30 IST