Kollu Ravindra : వైసీపీ వాళ్ల పై కేసులు ... అరెస్టులు ఉండవ్

ABN , First Publish Date - 2023-09-06T13:34:11+05:30 IST

వైసీపీ నాయకుల అరాచకాలు శృతి మించుతున్నాయని టీడీపీ నేత కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. యువగళం పాదయాత్రకు ఆటంకం కలిగించేలా రెచ్చగొట్టారన్నారు. కర్రలు, రాళ్లు, సీసాలతో దాడులకు తెగ బడ్డారన్నారు.

Kollu Ravindra : వైసీపీ వాళ్ల పై కేసులు ... అరెస్టులు ఉండవ్

విజయవాడ : వైసీపీ నాయకుల అరాచకాలు శృతి మించుతున్నాయని టీడీపీ నేత కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. యువగళం పాదయాత్రకు ఆటంకం కలిగించేలా రెచ్చగొట్టారన్నారు. కర్రలు, రాళ్లు, సీసాలతో దాడులకు తెగ బడ్డారన్నారు. యువగళం వలంటీర్లు వారిని అడ్డుకున్నారని.. లేకుంటే మా వాళ్ల ప్రాణాలు పోయేవని కొల్లు రవీంద్ర తెలిపారు. గన్నవరంలో కూడా ఇదే విధంగా దాడి చేశారన్నారు. దాడులు చేసిన వైసీపీ వాళ్లను పోలీసులు వదిలేశారన్నారు. అర్ధరాత్రి యువగళం వలంటీర్లను అరెస్టు చేయడం దుర్మార్గం కాదా? అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. వాళ్లను స్టేషన్‌లో ఉంచకుండా ప్రైవేటు గోడౌన్ లో ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ వాళ్ల పై కేసులు ... అరెస్టులు ఉండవన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా? అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. డీజీపీ, జిల్లా ఎస్పీలు వాళ్ల ఆగడాలను అరి కట్టలేక పోతున్నారన్నారు. కొంతమంది పోలీసు అధికారులు పాలకుల చెప్పు చేతల్లో పని చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు, వైసీపీ రౌడీయిజాన్ని ప్రజల్లోకి తీసుకెళతామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-06T13:34:11+05:30 IST