YS Sharmila: పులివెందులలో పర్యటన.. రేపటి ప్రకటనపై అభిమానుల్లో ఆసక్తి..!

ABN , First Publish Date - 2023-09-01T21:35:16+05:30 IST

పులివెందులలో వైఎస్‌ షర్మిల(YS Sharmila) పర్యటిస్తున్నారు.

YS Sharmila: పులివెందులలో  పర్యటన.. రేపటి ప్రకటనపై అభిమానుల్లో ఆసక్తి..!

కడప: పులివెందులలో వైఎస్‌ షర్మిల(YS Sharmila) పర్యటిస్తున్నారు. శుక్రవారం నాడు ఆమె హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరి వెళ్లారు. రేపు వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఇడుపుల పాయలో అన్నీ ఏర్పాట్లు చేశారు. పులివెందుల(Pulivendula)లో అనాథశరణాలయాన్ని సందర్శించి అక్కడి విద్యార్ధులతో కాసేపు ముచ్చటించారు. షర్మిళ ఆధ్వర్యంలోనే అనాథశరణాలయం నడుస్తోంది. కాంగ్రెస్‌లో విలీనంపై నేడు అధికారికంగా ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఉందా అని షర్మిల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ షర్మిల కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేస్తే ఏపీ కేంద్రంగా ఆమె తన మార్కు రాజకీయంతో చక్రం తిప్పే అవకాశాలు లేకపోలేదు. కాగా రేపు ఉదయం ఇడుపులపాయకు వైఎస్‌ జగన్‌ వచ్చి వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సీఎం జగన్ విదేశాలకు బయలుదేరి వెళ్లనున్నారు.

Updated Date - 2023-09-01T22:26:39+05:30 IST