DL Ravindra Reddy: ఆ కేసులో భారతి కూడా జైలుకు వెళ్తారు

ABN , First Publish Date - 2023-10-02T15:29:59+05:30 IST

వైఎస్ వివేకానందరెడ్డి కేసు(YS Vivekananda Reddy case)లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Reddy)తో పాటు ఆయన సతీమణి భారతి(Bharthi) కూడా జైలుకు వెళ్తారని మాజీమంత్రి డీఎల్ రవీంధ్రారెడ్డి(DL Ravindra Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

DL Ravindra Reddy: ఆ కేసులో భారతి కూడా జైలుకు వెళ్తారు

కడప: వైఎస్ వివేకానందరెడ్డి కేసు(YS Vivekananda Reddy case)లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Reddy)తో పాటు ఆయన సతీమణి భారతి(Bharthi) కూడా జైలుకు వెళ్తారని మాజీమంత్రి డీఎల్ రవీంధ్రారెడ్డి(DL Ravindra Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ...‘‘2024 ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన కూటమి 160 సీట్లు సాధిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు. చంద్రబాబును అరెస్టు చేసి సీఎం జగన్‌రెడ్డి తన గోతిని తానే తవ్వుకున్నాడు. జగన్మోహన్‌రెడ్డిని త్వరలో ఏపీ నుంచి తరిమేసే రోజులు వస్తాయి. జగన్‌రెడ్డి పరిపాలన అంతా అవినీతి మయం. జగన్‌రెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అవినీతిలో కూరుకుపోయారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అజయ్ కల్లాంరెడ్డి వివేకానందరెడ్డి హత్యకేసులో యూటర్న్ తీసుకోవడం చాలా బాధ కలిగించింది’’ అని డీఎల్ రవీంధ్రారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-10-02T22:53:07+05:30 IST